'సంక్రాంతి'కంటే క్రిస్మస్ నే ఎక్కువ టార్గెట్ చేసారుగా ?

మరిన్ని వార్తలు

టాలీవుడ్ లో సహజంగా సంక్రాంతికి సినిమాల పోటీ ఎక్కువ ఉంటుంది. అయితే ఈ సారి క్రిస్మస్ కి సంక్రాంతికంటే ఎక్కువ పోటీ ఉంది. ఈ క్రిస్మస్ కి స్టార్ హీరోల సినిమాలతో పాటు కుర్ర హీరోలు కూడా తమ సినిమాలను పోటీకి దించుతున్నారు. అయితే సంక్రాంతి సింహంగా పేరున్న బాలయ్య ఈ సారి సంక్రాంతిని వదిలేసి ఫ్యాన్స్ కి క్రిస్మన్ ట్రీట్ ఇవ్వనున్నారు. ఆయన నటిస్తున్న రూలర్ మూవీ డిసెంబర్ 20న విడుదల అవుతుంది. బాలయ్య రెండు భిన్నమైన పాత్రలో కనిపిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

 

ఇక లెజెండరీ ప్రొడ్యూసర్ స్వర్గీయ రామానాయుడు డ్రీం ప్రాజెక్ట్ గా తెరకెక్కిన వెంకీ మామ మూవీ డిసెంబర్ 13న విడుదల కానుంది. ఈ చిత్రం క్రిస్మస్ కి రెండు వారాలు ముందే రిలీజ్ అవుతున్నప్పటికీ రూలర్ మూవీ విడుదల ఐయ్యేవరకూ చిన్న సినిమాలు మినహా చెప్పుకోదగ్గ సినిమాలేవి విడుదల లేవు. కాబట్టి వెంకీ మామ రన్ ఢోకా లేకుండా క్రిస్మస్ వరకు నడుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

 

మెగా హీరో సాయిధరమ్ తేజ్ ప్రతిరోజూ పండుగే చిత్రం విడుదల తేదీ డిసెంబర్ 20గా ప్రకటించారు. అదేరోజు రూలర్ కూడా విడుదల నేపథ్యంలో ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీపడనున్నాయి. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రతిరోజూ పండుగే తెరకెక్కింది. ఇక యంగ్ హీరో రాజ్ తరుణ్ పండుగ రోజే 'ఇద్దరి లోకం ఒకటే' సినిమాతో దిగనున్నాడు. అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ దిల్ రాజు నిర్మించడం విశేషం. ఇక ఈ సినిమాలలో ఎన్ని హిట్ అవుతాయో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS