త‌ల్లిదండ్రుల‌పై కేసు పెట్టిన విజ‌య్‌

మరిన్ని వార్తలు

త‌మిళ స్టార్ హీరో అభిమానుల‌తో పాటు, రాజ‌కీయ వ‌ర్గాన్నీ షాక్ కి గురి చేశారు. త‌న త‌ల్లిదండ్రుల‌పై కేసు పెట్టారు. ఈ విష‌యం ఇప్పుడు త‌మిళ నాట హాట్ టాపిక్ గా మారింది. కోట్లాది అభిమానులు దైవంగా కొలిచే విజ‌య్‌... త‌ల్లిదండ్రుల‌పై కేసు పెట్ట‌డం ఏమిట‌ని త‌మిళ‌నాట ఆస‌క్తిగా చ‌ర్చించుకుంటున్నారు. విష‌యం ఏమిటంటే... విజ‌య్ ముక్క‌ల్ ఇల్ల‌క‌మ్ పేరుతో త‌మిళ నాట ఓ పార్టీని స్థాపించారు.

 

ఈ పార్టీలో విజ‌య్ త‌ల్లిదండ్రులు కీల‌క ప‌ద‌వులు అందుకున్నారు. విజ‌య్ త‌ల్లిండ్రులు ఉన్నారు కాబ‌ట్టి, ఫ్యాన్స్ ఈ పార్టీని విజ‌య్ పార్టీగానే భావించే అవ‌కాశం ఉంది. అందుకే అప్ప‌ట్లోనే `ఈ పార్టీకీ నాకూ సంబంధం లేదు` అని విజ‌య్ ప్ర‌క‌టించారు కూడా. ఈ పార్టీ పేరు మార్చుకోమ‌ని, లేదంటే చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటానని విజ‌య్ అప్ప‌ట్లోనే హెచ్చ‌రించారు.

 

కానీ వాళ్లు ఖాత‌రు చేయ‌లేదు. దాంతో విజ‌య్ త‌న త‌ల్లిదండ్రుల‌తో స‌హా ప‌ద‌కొండు మందిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. త‌ల్లిదండ్రుల‌తో ఈ విష‌యమై ఎన్నిసార్లు చ‌ర్చించినా, వాళ్లు స్పందించ‌లేద‌ని, అందుకే ఫిర్యాదు చేయాల్సివ‌చ్చింద‌ని విజ‌య్ స‌న్నిహితులు చెబుతున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS