పింక్‌ సిటీలో టాలీవుడ్‌ స్టార్స్‌.!

మరిన్ని వార్తలు

పింక్‌ సిటీకి టాలీవుడ్‌ తరలి వెళ్లింది. ఎందుకనుకుంటున్నారా.? జక్కన్న తనయుడు కార్తికేయ వివాహ సందర్భంగా టాలీవుడ్‌ స్టార్స్‌ అంతా పింక్‌ సిటీలో సందడి చేస్తున్నారు. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌, ప్రబాస్‌, రానా, నాని తదితర టాలీవుడ్‌ స్టార్‌ హీరోలంతా పింక్‌ సిటీలో సందడి చేస్తున్నారు. జగపతిబాబు సోదరుడి కుమార్తై పూజా ప్రసాద్‌తో జక్కన్న కుమారుడు కార్తికేయ వివాహం ఈ నెల 30న ఘనంగా జరగనుంది. 

 

ఈ వివాహ వేడుకకు టాలీవుడ్‌తో పాటు, పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు కూడా హాజరయ్యారు. శుక్రవారానికే సినీ స్టార్స్‌ అంతా జైపూర్‌లో ల్యాండ్‌ ఆయ్యారు. అక్కడి వివాహ వేడుకల్లో సందడిగా పాల్గొంటున్నారు. అక్కడి నుండి విడుదలైన పిక్స్‌ కొన్ని సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నాయి. వాటిలో సంగీత్‌ సందర్భంగా రామ్‌చరణ్‌, రాజమౌళి తీన్‌మార్‌ డాన్సులు వేసిన ఫోటోలు ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగిస్తున్నాయి. 

 

అలాగే ప్రబాస్‌, రానా తదితర హీరోలు డాన్సుల్లో పాల్గొన్న వీడియోలు హల్‌చల్‌ చేస్తున్నాయి. గత కొన్నాళ్లుగా కార్తికేయ, పూజా ప్రేమలో ఉన్నారు. పెద్దల అంగీకారంతో నవంబర్‌లో వీరి నిశ్చితార్ధం జరిగింది. రేపు అనగా 30న జరగనున్న వివాహా వేడుకకు స్టార్స్‌ అందర్నీ ఆత్మీయంగా ఆహ్వానిస్తున్నారు రాజమౌళి కుటుంబ సభ్యులు. శనివారం స్టార్స్‌ అందరికీ అదిరిపోయే విందు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS