సాహోతో ప్రభాస్ నిరాశ పరిచాడు. హంగులన్నీ భారీగా ఉన్నా, స్టార్లు కోకొల్లలుగా కనిపించినా - బలమైన కథ లేకపోవడంతో చతికిలపడింది. అయితే అందులోంచి బయటకు వచ్చి, తన కొత్త సినిమా షూటింగ్తో బిజీ కానున్నారు. ప్రభాస్ కథానాయకుడిగా రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కృష్ణంరాజుతో కలసి యూవీ క్రియేషన్స్సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. త్వరలోనే కొత్త షెడ్యూలు ప్రారంభం కానుంది. అందుకోసం ప్రత్యేకంగా ఓ రైలు సెట్ని డిజైన్ చేశారు.
అన్నపూర్ణలో అత్యంత భారీ ఎత్తున ఈ సెట్ రూపకర్తన జరిగింది. ఇందుకోసం దాదాపు 1.5 కోట్లు కేటాయించినట్టు సమాచారం. ఈ రైలులోనే దాదాపు 11 రోజుల పాటు షూటింగ్ జరగబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తయింది. 2020 వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉంది. ఈ చిత్రం కోసం జాన్ అనే పేరు పరిశీలిస్తున్నారు. కానీ.. పేరు మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.