ఫ్యాన్స్‌కి షాకిచ్చిన త్రిష.!

మరిన్ని వార్తలు

గత 15 ఏళ్లుగా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో అందాల రాణిగా వెలుగొందుతోన్న త్రిష రీసెంట్‌గా తన మనసులోని అభిప్రాయాల్ని అభిమానులతో పంచుకుంది. పెళ్లి బ్రేకప్‌ చేసుకుని, సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసిన త్రిషకు తెలుగులో అవకాశాలు లేవు కానీ, తమిళంలో విపరీతంగా క్రేజ్‌ ఉంది. 

హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీస్‌తో దూస్కెళ్తోంది. అయితే ఇకపై త్రిష కొత్త తరహా పాత్రలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తానని చెబుతుండడం విశేషం. కొత్త తరహా అంటే అందులో నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలైనా తనకి ఓకే అంటోంది. చారిత్రక నేపథ్యం ఉన్న పాత్రల్లో నటించాలని ఉందంటోంది. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి 'జయలలిత' బయోపిక్‌లో తనకు నటించాలని ఉందన్న కోరికను బయట పెట్టింది. ఆ వెంటనే నెగిటివ్‌ షేడ్‌ పాత్రలకూ సై అంటూ ఫ్యాన్స్‌కి షాకిచ్చింది. 

మొత్తానికి త్రిష గ్లామర్‌ పాత్రలకు దూరమని చెప్పకనే చెప్పేసింది. విభిన్నతరహా పాత్రల్లోనే తాను ఇకపై కనిపించబోతున్నానని స్పష్టం చేసింది. విక్రమ్‌ హీరోగా తెరకెక్కుతోన్న 'సామి 2' చిత్రంలో త్రిష నటించాల్సి ఉంది. కానీ ఎందుకో ఆ పాత్రకు నో చెప్పింది. అదే ప్లేస్‌లోకి కీర్తి సురేష్‌ వచ్చి చేరింది. అయితే కీర్తికి, త్రిషకు మధ్య విబేధాల కారణంగా ఆ పాత్ర నుండి త్రిష వైదొలగిందనీ అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ పాత్ర నచ్చకే నో చెప్పాననీ, విబేధాల గట్రా ఏమీ లేవని త్రిష తాజాగా తేల్చేసింది. 

ప్రస్తుతం తమిళంలో నాలుగు వరుస సినిమాలతో బిజీగా ఉంది త్రిష. త్రిష ప్రధాన పాత్రలో రూపొందిన 'మోహిని' చిత్రంతో పాటు, విజయ్‌సేతుపతి హీరోగా తెరకెక్కిన '96' చిత్రాలు త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS