త్రివిక్ర‌మ్ చెప్పాడు... మ‌రి ప‌వ‌న్ వింటాడా?

మరిన్ని వార్తలు

ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడ‌ని చాలా రోజుల నుంచి వార్త‌లు వ‌స్తున్నాయి. వాటిని ప‌వన్ క‌ల్యాణ్ స‌న్నిహితులు, జ‌న‌సేన వ‌ర్గం ఎప్ప‌టిక‌ప్పుడు ఖండిస్తూనేఉంది. కాక‌పోతే... ప‌వ‌న్ సినిమాలు చేసే ఛాన్స్‌, స‌మ‌యం ఇప్పుడే ఉంది. రాబోయే ఎన్నిక‌లులోపు ప‌వ‌న్ ఇటు రాజ‌కీయం, అటు సినిమాలు రెండూ చేసుకోవ‌చ్చు. అందుకే ప‌వ‌న్‌ని మ‌ళ్లీ సినిమాల్లోకి దింపాల‌ని చాలామంది ప్ర‌య‌త్నిస్తున్నారు.

 

అందులో మ‌రింత ముఖ్యుడు త్రివిక్ర‌మ్‌. దిల్‌రాజు `పింక్‌` రీమేక్ లో ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తాడ‌ని గ‌ట్టిగా ప్రచారం జ‌రుగుతోంది. బాలీవుడ్‌లో అమితాబ్ బ‌చ్చ‌న్ పోషించిన పాత్ర ప‌వ‌న్ చేస్తాడ‌ని రూమ‌ర్లు వినిపిస్తున్నాయి. ఎప్ప‌టిలా ఈ వార్త‌ల్ని కొట్టిప‌రేయ‌డానికి వీల్లేదు. దిల్ రాజు బ‌డా నిర్మాత‌. ఆయ‌న అనుకుంటే ఏమైనా జ‌ర‌గొచ్చు. పైగా రీమేక్ క‌థ కాబ‌ట్టి - సేఫ్ గేమ్ ఆడ‌డానికి అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. ప‌వ‌న్ ఒప్పుకుంటాడా, లేదా? అనేదే కీల‌కం.

 

అయితే ప‌వ‌న్ ని ఒప్పించే బాధ్య‌త త్రివిక్ర‌మ్ తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఇటీవ‌ల ప‌వ‌న్ - త్రివిక్ర‌మ్ మ‌ధ్య భేటీ జ‌రిగింద‌ని, వీరిద్ద‌రి మ‌ధ్య `పింక్‌` రీమేక్ గురించిన చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని వార్త‌లొస్తున్నాయి. త్రివిక్ర‌మ్‌తో ఉన్న సాన్నిహిత్యం కొద్దీ ప‌వ‌న్ ఈ ప్రాజెక్టుని ఓకే చేస్తాడేమో అని దిల్‌రాజు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాడు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS