త్వరలోనే బిగ్ బాస్ కొత్త సీజన్ ప్రారంభం కాబోతోంది. అందుకు అన్ని ఏర్పాట్లూ జరిగిపోయాయి. ఈసారి 12 మంది కంటెస్టెంట్లు ఈ రియాలిటీ షోలో పాల్గొంటారని తెలుస్తోంది. ఎప్పటిలానే సినిమా, టీవీ, సోషల్ మీడియా స్టార్లు బిగ్ బాస్లో సందడి చేయబోతున్నారు. ప్రతీ సీజన్లోనూ టీవీ 9 నుంచి ఓ యాంకర్ ని తీసుకోవడం అలవాటైపోయింది. దీప్తి, జాఫర్, దేవీ నాగవల్లి.. అలా టీవీ 9 నుంచి ఈ షోలో మెరిశారు. ఈసారి కూడా టీవీ 9 నుంచి ఓ న్యూస్ యాంకర్ ని తీసుకుంటారని ముందు నుంచీ గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అదే నిజం కాబోతోంది కూడా.
ఈసారి టీవీ 9 నుంచి ప్రత్యూష ని బిగ్ బాస్ కోసం ఎంచుకొన్నార్ట. ఆమె ఎగ్రిమెంట్లపై సంతకాలు చేసిందని, ఈసారి ఈ షోలో తాను మెరవడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఈనెల 25 నుంచి కంటెస్టెంట్లు కొవిడ్ నిబంధనల్ని అనుసరించి క్వారెంటైన్కి వెళ్లబోతున్నారు. ఆ తరవాత.. బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తారు. సెప్టెంబరు తొలి వారంలో బిగ్ బాస్ - 6 కి క్లాప్ కొడతారు. వర్షిణి, దీపికాపల్లి, నవ్య గోస్వామి, హైపర్ ఆది... వీళ్లంతా ఈ సీజన్లో కనిపించే ఛాన్స్ ఉంది.