‘సరిలేరు నీకెవ్వరూ..’ తర్వాత సూపర్ స్టార్ మహేష్బాబు వంశీ పైడిపల్లితో సినిమాని అనౌన్స్ చేసి, తర్వాత ఎందుకో హ్యాండిచ్చేశాడు. ఇక ఆ తర్వాత పరశురామ్తో చేతులు కలిపాడు. పరశురామ్తో మహేష్ బాబు సినిమా దాదాపు ఓకే అయ్యిందనీ ప్రచారం జరుగుతోంది. కానీ అధికారికంగా క్లారిటీ లేదు. అయితే, ఈ ప్రాజెక్ట్పై మహేష్ సుముఖంగా ఉన్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం. అంతేకాదు, పరశురామ్ స్క్రిప్టు పనులు కూడా కంప్లీట్ చేసేసాడనీ అంటున్నారు.
ఇకపోతే ఇప్పుడు కాస్టింగ్పైనా పరశురామ్ దృష్టి పెట్టారట. ఆ క్రమంలో మహేష్తో ఢీకొట్టబోయే ప్రతినాయకుని పాత్రకు కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్రను ఎంచుకున్నారనీ తెలియ వస్తోంది. కన్నడలో స్టార్ హీరో అయిన ఉపేంద్ర కథ నచ్చి, క్యారెక్టర్ని ఇష్టపడితే ఇతర భాషల్లోనూ సినిమాలు చేసేందుకు ఎప్పుడూ ఓకే అంటారన్న సంగతి పలుమార్లు స్పష్టమైంది. గతంలో అల్లు అర్జున్ హీరోగా ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలో ఆయన విలన్గా నటించిన సంగతి తెలిసిందే. ఒకవేళ జరుగుతున్న ప్రచారం నిజమైతే, మహేష్బాబు సినిమాతో ఉపేంద్రను మళ్లీ తెలుగు సినిమాలో చూడొచ్చన్న మాట. ఇదంతా జరగాలంటే, మరి కొంత సమయం వెయిట్ చేయాలలేమో.