'సాహో' కోసం ముస్తాబైన 'బిగ్‌' స్క్రీన్‌!

మరిన్ని వార్తలు

విడుదలకు ముందే 'సాహో' సంచలనమైంది. కనీ వినీ ఎరుగని రీతిలో రికార్డులు సృష్టిస్తోంది. 'సాహో' రికార్డ్స్‌ లిస్టులో మరో రికార్డు జాయిన్‌ అయ్యింది. సాహో నిర్మాణ సంస్థ అయిన యూవీ క్రియేషన్స్‌ వారు నెల్లూరు జిల్లాలోని సూళ్లూరు పేటలో ఓ బడా మల్టీ ఫెక్స్‌ని నిర్మించారు. 'వీ' సెల్యులాయిడ్‌ అనే ఈ మల్టీఫ్లెక్స్‌ 'సాహో' సినిమాతో ఆరంభం కాబోతోంది. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ చేతుల మీదుగా ఈ మల్టీఫ్లెక్స్‌ ప్రారంభం కాబోతోంది.

 

ప్రపంచంలోనే మూడో పెద్ద స్క్రీన్‌గా, ఆసియాలోనే రెండో బిగ్‌ స్క్రీన్‌, ఇండియాలోనే మొదటి బిగ్‌ స్క్రీన్‌గా ఈ కాంప్లెక్స్‌ని అభివర్ణిస్తున్నారు. 650 మంది ప్రేక్షకులు ఒకేసారి ఈ ధియేటర్‌లో కూర్చుని సినిమాని వీక్షించే అవకాశముంది. 106 ఆడుగుల వెడల్పు, 94 అడుగుల ఎత్తుతో ఈ స్క్రీన్‌ నిర్మించారు.

 

ఈ బిగ్‌ స్క్రీన్‌లో ప్రదర్శించబోయే తొలి తెలుగు సినిమాగా 'సాహో' రికార్డులకెక్కింది. సుమారు 7 ఎకరాల విస్తీర్ణంలో ఈ భారీ మల్టీ ఫ్లెక్స్‌ని నిర్మించారు యూవీ క్రియేషన్స్‌ అధినేతలైన వంశీ, ప్రమోద్‌. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ బిగ్‌ మల్టీ మూవీ కాంప్లెక్స్‌ ఇప్పుడు అందరి దృష్టినీ విశేషంగా ఆకర్షిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS