మాధవన్‌ సినిమా రీమేక్‌లో వెంకీ ఇంకోస్సారి?

By iQlikMovies - May 07, 2019 - 11:30 AM IST

మరిన్ని వార్తలు

మాధవన్‌ ప్రధాన పాత్రలో రూపొందిన 'సాలా ఖడూస్‌' చిత్రం తెలుగులో వెంకటేష్‌ ప్రధాన పాత్రలో 'గురు' టైటిల్‌తో రీమేక్‌ అయ్యి, మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి వెంకీ, మాధవన్‌ సినిమా రీమేక్‌లో నటించబోతున్నాడంటూ టాలీవుడ్‌ టాక్‌. ఇంతకీ అదేంటంటే, 'విక్రమ్‌ వేదా'. గత కొంత కాలం నుండీ ఈ సినిమా రీమేక్‌ విషయంలో చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాని వెంకీ కన్‌ఫామ్‌ చేశాడంటూ ప్రచారం జరుగుతోంది.

 

బేతాళ కథలు ఆధారంగా తెరకెక్కిన 'విక్రమ్‌ వేదా' కాన్సెప్ట్‌ అన్ని వర్గాల వారినీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. తమిళంలో పుష్కర్‌ - గాయత్రి ఈ సినిమాని తెరకెక్కించారు. తెలుగులో సీనియర్‌ దర్శకుడు వినాయక్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడనీ తెలుస్తోంది. కాన్సెప్ట్‌ అదే తీసుకుని, తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా కొన్ని మార్పులు చేయనున్నారట. నిజానికి ఇదో మల్టీ స్టారర్‌. మాధవన్‌తో పాటు, విలక్షణ హీరో విజయ్‌ సేతుపతి కూడా నటించాడు. ఇక తెలుగు విషయానికి వస్తే, వెంకీ, నారా రోహిత్‌ కాంబినేషన్‌లో ఈ సినిమా రూపొందనుందనీ తెలుస్తోంది. మల్టీ స్టారర్‌ మూవీస్‌కి సంబంధించి, టాలీవుడ్‌లో మొదటి ప్లేస్‌ని ఆక్యుపై చేస్తాడు విక్టరీ వెంకటేష్‌.

 

ఇటీవలే యంగ్‌ హీరో వరుణ్‌తేజ్‌తో కలిసి 'ఎఫ్‌ 2'తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్నాడు వెంకీ. ఇదే జోష్‌తో ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి 'వెంకీ మామ'లో నటిస్తున్నాడు. తాజాగా ఈ కొత్త కాన్సెప్ట్‌ కూడా వెంకీ కోసమే రెడీ అవుతోండడం విశేషం. వెంకీ బాటలోనే నడిచే యంగ్‌ హీరో నారా రోహిత్‌. కథ నచ్చితే తన పాత్ర ఎలాంటిదనేది అస్సలు ఆలోచించడు. అలాంటి ఈ కాంబినేషన్‌, వినాయక్‌ వంటి డెడికేషన్‌.. అన్నీ కుదిరితే ఇదో సెన్సేషనల్‌ ప్రాజెక్ట్‌ అవడం నిఖార్సయిన నిజం.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS