శ్రీనివాసుడితో గొంతు కలిపిన వెంకటేష్‌.!

మరిన్ని వార్తలు

మహేషే కాదు వెంకటేష్‌ కూడా నితిన్‌కి హ్యాండిచ్చాడు. హ్యాండివ్వడం అంటే ఇది మీరనుకునే హ్యాండివ్వడం కాదులెండి. నితిన్‌ హీరోగా దిల్‌రాజు బ్యానర్‌లో రూపొందుతోన్న చిత్రం 'శ్రీనివాస కళ్యాణం' సినిమా కోసం వెంకటేష్‌, మహేష్‌లు కలిసొచ్చారు. 

ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ని మహేష్‌బాబు చేతుల మీదుగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ కారణంగా సినిమాకి హైప్‌ పెరిగింది. ఆల్రెడీ అంచనాలున్న ఈ సినిమాకు మరో క్రేజ్‌ తోడయ్యింది. అదే వెంకటేష్‌ వాయిస్‌ ఓవర్‌. గతంలో చాలా చిత్రాలకు స్టార్‌ హీరోల వాయిస్‌ ఓవర్‌ ప్లస్‌ అయ్యింది. పవన్‌ కళ్యాణ్‌ 'జల్సా' సినిమాకి మహేష్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చాడు. 'మర్యాద రామన్న'కు రవితేజ వాయిస్‌ ప్లస్‌ అయ్యింది. ఇలా పలువురు హీరోల సినిమాలకు ఇతర హీరోలు వాయిస్‌ అందించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలా ఇప్పుడు వెంకీ వాయిస్‌ ఓవర్‌తో 'శ్రీనివాస కళ్యాణం' సినిమా రానుందన్న మాట. 

దిల్‌ రాజు - సతీష్‌ వేగేశ్న కాంబినేషన్‌ అంటే బెస్ట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'శతమానం భవతి' చిత్రమే గుర్తొస్తుంది. పెద్ద సినిమాలకు పోటీగా వచ్చి వసూళ్ల పరంగా బాక్సాఫీస్‌ వద్ద ధైర్యంగా నిలబడిన సినిమా అది. అందుకే ఈ కాంబినేషన్‌పై అంత నమ్మకంగా ఉంది చిత్ర యూనిట్‌. ఆల్రెడీ ఇంతవరకూ విడుదలైన పోస్టర్లు, ట్రైలర్‌, టీజర్‌ సినిమాపై పోజిటివ్‌ బజ్‌ని క్రియేట్‌ చేస్తున్నాయి. 

ఇప్పుడు వెంకీ వాయిస్‌ కూడా తోడవడంతో సినిమాకి మరింత హైప్‌ క్రియేట్‌ అయ్యింది. రాశీఖన్నా, నందితా శ్వేతా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS