'అర్జున్‌రెడ్డి'కి ఫ్రీడమ్‌ వచ్చేసిందోచ్‌.!

మరిన్ని వార్తలు

ప్రస్తుతం యంగ్‌ హీరోస్‌లో విజయ్‌ దేవరకొండ ఫుల్‌ బిజగా ఉన్నాడనే చెప్పాలి. ఒకటి కాదు, రెండు కాదు, నాలుగైదు సినిమాలను పట్టాలెక్కించేశాడు మనోడు. ఆల్రెడీ రెండు సినిమాలు రిలీజ్‌కి రెడీగా ఉండగా, మరో మూడు సినిమాల వరకూ ఓకే చేసి పెట్టాడు. 

ఇకపోతే విజయ్‌ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం 'గీతా గోవిందం' గురించే ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. దీనికి కారణం ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్సే. విజయ్‌కి జోడీగా ఈ సినిమాలో 'ఛలో' ఫేం రష్మికా మండన్నా నటిస్తోంది. మొన్న విడుదలైన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌తోనే సినిమాపై అంచనాలు పెంచేసిన ఈ సెన్సేషనల్‌ స్టార్‌ ఇప్పుడు మరో పోస్టర్‌ని విడుదల చేశాడు. ఈ సినిమా విడుదల డేట్‌ని కన్‌ఫామ్‌ చేస్తూ వచ్చిన ఈ పోస్టర్‌లో విజయ్‌దేవరకొండ, హీరోయిన్‌ రష్మికా వైపు కోపంగా చూస్తున్నాడు. 'నా వయసు 25..నేను ఇప్పటికీ వర్జినే మేడమ్‌..' అని ఆ పోస్టర్‌పై రాసుంది. ఈ స్టేట్‌మెంట్‌ యూత్‌ని ఇంకా ఇంప్రెస్‌ చేసేస్తోంది. 

ఖచ్చితంగా ఈ సినిమాతోనూ యూత్‌ని మెస్మరైజ్‌ చేసేస్తాడీ కిలాడీ కుర్రోడు అనుకుంటున్నారంతా. 'పెళ్లిచూపులు', 'అర్జున్‌రెడ్డి' సినిమాలతో వరుసగా సంచలన విజయాల్ని తన ఖాతాలో వేసుకున్న విజయ్‌ దేవరకొండ 'మహానటి'లోని ఇంపార్టెంట్‌ రోల్‌తోనూ మరో విజయం అందుకున్నాడు. ఈ సారి సోలో హీరోగా మళ్లీ వచ్చేస్తున్నాడు. ఆగష్టు 15న 'గీతా గోవిందం' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

'గోవిందం'గా ఈ సినిమాతో అందరూ మెచ్చిన మన అర్జున్‌రెడ్డి ఎలాంటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తాడో చూడాలి మరి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS