ఒక్క సినిమాతో సెన్సేషనల్ అయిపోయాడు. డిఫరెంట్ ఆటిట్యూడ్తో ఫ్యాన్స్ని 'రౌడీ'స్గా మార్చేశాడు. ఆ రౌడీస్ అందరికీ 'రౌడీ స్టార్' అయిపోయాడు. విజయ్ దేవరకొండ ఏం చేసినా అదో ట్రెండ్ అయిపోయిందంతే. 'గీత గోవిందం'తో బాక్సాఫీస్ బంపర్ హిట్ కొట్టాడు. అయితే, లేటెస్ట్గా వచ్చిన 'డియర్ కామ్రేడ్'తో కాస్త చతికిలబడ్డాడు. కానీ, రౌడీ ఆటిట్యూడ్ మాత్రం మార్చుకోలేదు.
హిట్ వచ్చినప్పుడు ఎంత అగ్రెసివ్గా ఉన్నాడో, ఫ్లాప్నీ అలాగే స్వీకరించాడు. ఇక తాజాగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు మన రౌడీ. హీరోగా మనోడి ముచ్చట్లు ఇలా ఉంటే, నిర్మాతగానూ సత్తా చాటాలనుకుంటున్నాడు. తనను హీరోగా పరిచయం చేసిన దర్శకుడిని హీరోగా మార్చేసి, తన సొంత నిర్మాణంలో ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఎక్కడైనా విన్నారా? తనకు డెబ్యూ ఇచ్చిన దర్శకున్నే హీరోని చేసేసిన హీరో. దటీజ్ విజయ్ దేవరకొండ. ఇంతకీ ఏంటా సినిమా? ఎవరా దర్శకుడు? అంటే, 'పెళ్లి చూపులు' సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన తరుణ్ భాస్కర్.
ఈయనే ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమాలో హీరో. నిజానికి ఈ సినిమా ఎప్పుడో స్టార్ట్ అయ్యిందనుకోండి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కంప్లీట్ చేసుకుంటోంది. లేటెస్ట్గా టైటిల్ని అనౌన్స్ చేశారు. టైటిల్ అనౌన్స్మెంట్ కూడా రౌడీ స్టైల్లోనే ఉంది. 'మీకు మాత్రమే చెప్తా' అనే టైటిల్ని ఈ సినిమాకు పెట్టారు. అనసూయ భరద్వాజ్ ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ పోషిస్తోంది. త్వరలో సినిమా విడుదల కానుంది. మరి రౌడీ స్టైల్లో సినిమా ఉందా.? లేదా.? అని తెలియాలంటే సినిమా విడుదల వరకూ ఆగాల్సిందే.