రౌడీ వెనకబడిపోయాడే?

మరిన్ని వార్తలు

యూత్‌ ఐకాన్‌గా పేరు తెచ్చుకున్న విజయ్‌ దేవరకొండ, కరోనా వేళ కామ్‌గా ఉండిపోయాడు. అప్పుడెప్పుడో కరోనా అంత ఉధృతంగా లేని తరుణంలో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచన మేరకు కరోనా నుండి కాపాడుకోవడానికి తీసుకోవల్సిన జాగ్రత్తలివే.. అంటూ ఓ వీడియోలో కనిపించి ఫ్యాన్స్‌కి సూచన చేశాడంతే. మళ్లీ ఇంతవరకూ ఎక్కడా కనిపించలేదు. ఇంతకు ముందు సోషల్‌ మీడియాకి టచ్‌లో లేని వాళ్లు కూడా కరోనా వేళ ప్రజలకు, అభిమానులకు తమ వంతు భరోసా అందించేందుకు ట్విట్టర్‌ అకౌంట్లు ఓపెన్‌ చేసిన సంగతి తెలిసిందే. అలాంటిది ఎప్పుడూ నెట్టింట్లో యాక్టీవ్ గా ఉండే విజయ్‌ దేవరకొండ ఎందుకు సైలెంట్‌ అయిపోయాడో అంటూ ఆయన ఫ్యాన్స్‌ అయిన రౌడీసే తెల్ల మొహం వేస్తున్నారట.

 

విపత్తు సమయాల్లో బాధితులకు చేయూతనందించడంలో మన రౌడీ అందరికంటే ముందుంటాడు. అలాంటిది ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు తమ వంతు విరాళాలను ప్రకటించి కరోనా బాధితుల కోసం మేము సైతం.. అంటూ ముందుకొచ్చారు. కానీ, విజయ్‌ దేవరకొండ ఇంతవరకూ ఎలాంటి విరాళం ప్రకటించినట్లు తెలియ రావడం లేదు. నిజానికి పబ్లిసిటీపై ఎక్కువ ఆసక్తి చూపించే విజయ్‌ దేవరకొండ ఆ రకంగా కూడా బయటికి రాకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రౌడీ ఫ్యాన్స్‌. అసలు రౌడీకి ఏమైంది.? ఎందుకు సైలెంట్‌గా ఉండిపోయాడు.? తెలియ రావల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS