ఐశ్వర్యా రాజేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'కౌసల్యా కృష్ణమూర్తి'. లేటెస్ట్గా జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ గెస్ట్గా విచ్చేశాడు. తనదైన మాటల గారడితో అలరించాడు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకున్నాడు. ఐశ్వర్య మంచి నటి అనీ, సినిమాలో బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిందనీ ఆమెపై అపారమైన అభిమానాన్ని చూపించాడు.
ఈ సందర్భంగా, ఆయన తన లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కూడా అందించేశాడు. ఇటీవల 'డియర్ కామ్రేడ్'తో నిరాశపరిచిన విజయ్ దేవరకొండ, ప్రస్తుతం క్రాంతిమాధవ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి నిర్మాత కె.ఎస్. రామారావుగారు. ఆయనే 'కౌశల్యా కృష్ణమూర్తి'ని కూడా నిర్మించారు. కె.ఎస్,రామారావు గారంటే తనకెంతో అభిమానమనీ, ఆయన బ్యానర్లో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందనీ, ఆయన గురించే తన సినిమా షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని మరీ, 'కౌశల్యా కృష్ణమూర్తి' సినిమా ప్రమోషన్స్లో పాల్గొన్నానని విజయ్ దేవరకొండ చెప్పాడు.
అంతేకాదు, ఆమె టాలెంట్కి ఇన్స్పైర్ అయ్యి, తన సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ కోసం, ఐశ్వర్య రాజేష్ని తీసుకున్నామన్న సీక్రెట్ కూడా రివీల్ చేశాడు. మరోవైపు విజయ్ దేవరకొండ - పూరీ జగన్నాధ్ కాంబినేషన్ కూడా ఓకే అయిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కాగానే పూరీ సినిమాని పట్టాలెక్కించేయనున్నాడట మన రౌడీ. అన్నట్లు ఈ ఈవెంట్లో ముద్దుగుమ్మ రాశీఖన్నా కూడా స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచింది. రౌడీతో క్రాంతి మాధవ్ చిత్రంలో రాశీఖన్నా నటిస్తోంది.