సోషల్ మీడియాలో అభిమానుల పేరుతో కొందరు దురభిమానులు చెలరేగిపోతున్న వైనం అత్యంత జుగుప్సాకరంగా మారుతోంది. తాజాగా తమిళ హీరో విజయ్ని సోషల్ మీడియాలో చంపేశారు. ‘రెస్ట్ ఇన్ పీస్ విజయ్’ అంటూ హ్యాష్ట్యాగ్లను ట్రెండ్ చేస్తున్నారు. ‘విజయ్ డెత్ డే’ అంటూ ఓ తేదీని ప్రచారంలోకి తీసుకొచ్చారు. విజయ్ కొత్త సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. కరోనా వైరస్ ఎఫెక్ట్ కారణంగా అది వాయిదా పడిన విషయం విదితమే. జూన్ నెలాఖరున ఈ సినిమాని విడుదల చేసేందుకు సన్నద్ధమవుతుండడంతో విజయ్ వ్యతిరేకులు ఈ చెత్త ‘ట్రెండింగ్’ కొనసాగిస్తున్నారు. ఇలా విజయ్ని కించపరుస్తున్న అభిమానులంతా తాము తమిళ హీరో అజిత్ అభిమానులమని చెప్పుకుంటున్నారు.
విజయ్ అభిమానులకీ, అజిత్ అభిమానులకీ గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా ‘వార్’ జరుగుతోంది. ఆ ‘వార్’ ఎప్పటికప్పుడు కొత్త చెత్త రికార్డుల్ని సృష్టిస్తోంది. నిజానికి, ఇలాంటి చెత్త ట్రెండింగ్లపై ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా సంస్థలే కరిÄన చర్యలు తీసుకోవాల్సి వుంటుంది. కరోనా వైరస్ కారణంగా ప్రపంచమే విలవిల్లాడుతున్న వేళ, అభిమానులిలా సోషల్ మీడియా వేదికగా కొట్టుకోవడం బాధ్యతారాహిత్యం. ఇది కరోనా వైరస్ కంటే ప్రమాదకరంగా మారుతోంది.