ఇరుకున ప‌డ్డ విశాల్‌.. అస‌లేం జ‌రుగుతోంది?

మరిన్ని వార్తలు

విశాల్ ఆఫీసులో జ‌రిగిన‌ 45 ల‌క్ష‌ల రూపాయ‌ల గోల్ మాల్ వ్య‌వ‌హారం... కోలీవుడ్ లో ప్రకంప‌న‌ల్ని, కొత్త వివాదాల‌నీ, అనుమానాల్నీ సృష్టిస్తోంది. త‌న ఆఫీసులో 45 ల‌క్ష‌లు మాయం అయ్యాయ‌ని, దానికి కార‌ణం.. ఆఫీసులో ఎకౌంటెడ్‌గా ప‌నిచేస్తున్న ర‌మ్య అని విశాల్ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం, పోలీసులు ఆమెపై కేసు న‌మోదు చేయ‌డం తెలిసిన విష‌యాలే.

 

అయితే ఇప్పుడు ర‌మ్య నోరు విప్పింది. తాను ఎలాంటి అక్ర‌మాల‌కూ పాల్ప‌డ‌లేదని, త‌ప్పంతా విశాల్ వైపే ఉంద‌ని ఆరోపిస్తోంది. చాలాకాలంగా విశాల్ ఆస్తి ప‌న్నులు చెల్లించ‌డం లేద‌ని, ఆ విష‌యం అధికారుల‌కు తెలిస్తే.. త‌న ప‌రువు పోతుంద‌న్న భ‌యంతో.. ఆ త‌ప్పు త‌న వైపుకు నెట్టేశార‌ని ఆరోపిస్తోంది. అంతే కాదు.. విశాల్‌కి సంబంధించిన చాలా నిజాలు, త‌న ద‌గ్గ‌ర సాక్షాధారాల‌తో ఉన్నాయ‌ని, పోలీసులు త‌న‌కు రక్ష‌ణ క‌ల్పిస్తానంటే వాటిని బ‌య‌ట‌పెడ‌తాన‌ని చెప్పుకొచ్చింది. దాంతో ర‌మ్య వ్యాఖ్య‌లు కోలీవుడ్ లో సంచ‌ల‌నం రేపుతున్నాయి. విశాల్ దాచిన నిజాలేంటి? అందుకు సంబంధించిన ఆధారాలేమున్నాయి? అనే విష‌యంలో చెన్నై వాసులు ఆస‌క్తిగా చ‌ర్చించుకుంటున్నారు. ఈ వ్య‌వ‌హారం అంతా విశాల్ కి కొత్త త‌ల‌నొప్పులు తీసుకొస్తున్నాయి. అస‌లే 45 ల‌క్ష‌లు పోయాయి. ఆపై ఈ కొత్త అనుమానాలొక‌టి. ర‌మ్య ఎప్పుడు ఎలాంటి సంచ‌ల‌నం బ‌య‌ట‌పెడుతుందో అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు అక్క‌డి జ‌నాలు. ఏం జ‌రుగుతుందో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS