కోలీవుడ్ లో విశాల్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాడు. తన ఎకౌంటెడ్ తనని దారుణంగా మోసం చేసిందని, తప్పుడు లెక్కలతో 45 లక్షలు గోల్ మాల్ చేసిందని విశాల్ ఆరోపించడం, ఆమెపై కేసు వేయడం.. రమ్య కూడా విశాల్ పై సంచలన ఆరోపణలు చేయడం తెలిసిన విషయాలే. విశాల్ చేస్తున్న మోసాలకు సంబంధించిన తన దగ్గర సాక్షాలు ఉన్నాయని, వాటిని బయటపెడతానని రమ్య హెచ్చరించింది.
ఈలోగా మరో ఘనట జరిగింది. విశాల్ వ్యక్తిగత మేనేజర్ హరి కుమార్ కారును కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దాంతో హరికుమార్ స్థానిక కొడంబాక్కం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ కారు ధ్వంసం వెనుక రమ్య ఉందని ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మొత్తానికి విశాల్ - రమ్యల వివాదం ముదురుతున్నట్టుగానే కనిపిస్తోంది. రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. రమ్య ఎప్పుడు ఏ నిజం బయటపెడుతుందో అని... తమిళ మీడియా వర్గాలు ఆమె వంక ఆసక్తిగా చూస్తున్నాయి. ఇప్పుడు రమ్య కోలీవుడ్ లో చిన్న సైజు సెలబ్రెటీ అయిపోయింది.