విద్యార్ధిని ఆత్మహత్య పై స్పందించిన విశాల్

మరిన్ని వార్తలు

నిన్నటిరోజున హైదరాబాద్ లోని అబిడ్స్ ప్రాంతంలో అందరూ చూస్తుండగానే ఒక విద్యార్ధిని ఆత్మహత్యకి పాల్పడడం మనం చూసాము. ఈ సంఘటన అందరిని ఎంతగానో కలిచివేసింది. పలువురు ప్రముఖులు కూడా ఈ విషయమై స్పందించారు. అలా స్పందించిన వారిలో హీరో విశాల్ కూడా ఉన్నారు. 

ఈ అంశం పైన ఆయన స్పందన ఇదే- 

నీట్ లో ర్యాంక్ రాలేదని జస్లీన్ కౌర్ అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయం విని చాలా బాధ అనిపించింది. నీట్ వల్ల ఒకరి తర్వాత ఒకరిగా చాలా మందిని కోల్పోయాం. దేశ భవిష్యత్తు విద్యార్థుల మీదే ఆధారపడి ఉంది. ఇది ఇలాగే కొనసాగితే విద్యార్థుల కలలు ఎండమావి గానే మిగిలిపోతాయి. విద్యార్థులు నీట్ పరీక్ష ని పబ్లిక్ సర్వీస్ పరీక్ష లాగే భావించి సాధించే వరకు ప్రయత్నించాలి. విద్యార్ధులకి సహాయం చేయడానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను.

నీట్ పరీక్ష ని భవిష్యత్తులో కొనసాగించేలా అయితే ప్రభుత్వమే విద్యార్ధులకి కోచింగ్ తో పాటు మానసిక స్థైర్యాన్ని పెంపొందించేలా శిక్షణ తరగతులు నిర్వహించాలి. పరిస్థితి ఇలానే ఉంటే దేశం లో ని పేద విద్యార్ధులకి వైద్య విద్య అనేది కలగానే ఉండిపోతుంది. 

- విశాల్     


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS