ప్ర‌భాస్- పూజా ... ఇద్ద‌రి మ‌ధ్యా ఏం జ‌రిగింది?

మరిన్ని వార్తలు

ప్ర‌భాస్ - పూజా హెగ్డే క‌లిసి `రాధే శ్యామ్‌`లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. చిత్రీక‌ర‌ణ కూడా దాదాపుగా పూర్త‌య్యింది. సంక్రాంతికి ఈసినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. అయితే.. ఇప్పుడు ఈ సినిమా గురించీ, ముఖ్యంగా పూజా గురించి ఓ రూమ‌ర్ టాలీవుడ్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. `రాధే శ్యామ్` సినిమా ముందు నుంచీ లేటే. దానికి త‌గ్గ‌ట్టు పూజా కూడా... చిత్ర‌బృందాన్ని బాగా విసిగించింద‌ని, చెప్పిన టైమ్ కి సెట్ కి వ‌చ్చేది కాద‌ని, ఈ విష‌యంలో ప్ర‌భాస్ చాలా అసంతృప్తిగా ఉన్నాడ‌ని, ఇద్ద‌రి మ‌ధ్యా మాట‌ల్లేవ‌ని... ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌భాస్ చాలా సైలెంట్. అలాంటి ప్ర‌భాస్ కే పూజా కోపం తెప్పించింద‌న్న‌ది ఈ రూమ‌ర్ల సారాంశం. అయితే... దీనిపై యూవీ క్రియేష‌న్స్ క్లారిటీ ఇచ్చేసింది. పూజా పూర్తి ప్రొఫెష‌న‌ల్ ఆర్టిస్ట్ అంటూ.. స‌ర్టిఫికెట్ ఇచ్చేసింది.

 

''పూజ ఎప్పుడూ చిత్రీకరణల విషయంలో ఇబ్బంది పెట్టలేదు. చాలా సమయపాలనతో ఉండేది. నిజానికి ఆమెతో పని చేయడం చాలా సులభం. ఈ రూమర్స్ కేవలం కొందరి ఊహకు తగ్గట్టుగా ఉన్నాయి. నాయకానాయికలు.. మొత్తం టీమ్ మధ్య ప్రతిదీ బాగానే ఉన్నాయి. ప్రేక్షకులు మర్చిపోలేని థియేట్రికల్ అనుభవాన్ని అందించడానికి చాలా సంతోషిస్తున్నాము'' అని వివరణ ఇచ్చింది. నిజానికి ప్ర‌తీ సినిమాపై ఏదో ఓ రూమ‌ర్ వ‌స్తూనే ఉంటుంది. అయితే ఏ చిత్ర నిర్మాణ సంస్థా ఇలా వివ‌ర‌ణ ఇచ్చుకోదు. ఎందుకంటే... అలా ఇచ్చుకుంటూ పోతే ప్ర‌తీరోజూ ఓ ప్రెస్ నోట్ విడుద‌ల చేయాల్సివ‌స్తుంది. పూజా విష‌యంలోనూ యూవీ అలానే కామ్ గా ఉండ‌కుండా వివ‌ర‌ణ ఇవ్వాల్సివ‌చ్చింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS