'రాజుగారి గది'లోకి తమన్నా ఎందుకు రానందంటే!

మరిన్ని వార్తలు

ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా 'రాజుగారి గది 3'. ఈ సినిమాని దర్శకుడు ఓంకార్‌ ముందుగా తమన్నాతో తెరకెక్కించాలనుకున్నాడు. సినిమా లాంఛనంగా ప్రారంభమయ్యాక తమన్నా ఈ ప్రాజెక్ట్‌ నుండి తప్పుకుంది. ఓంకార్‌ చెప్పిన కథ నచ్చకపోవడం వల్లే, తమన్నా తప్పుకుందని అప్పట్లో ప్రచారం జరిగింది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ విషయమై ఓంకార్‌ తాజాగా వివరణ ఇచ్చాడు. తమన్నాకి మొదట స్టోరీ లైన్‌ ఒక్కటే చెప్పాడట.

 

ఆ తర్వాత డెవలప్‌ చేసిన స్క్రిప్టు నచ్చలేదట. దాంతో తమన్నా కథలో కొన్ని మార్పులు చేర్పులు చేయమని సూచించిందట. కానీ, సమయం తక్కువ ఉండడంతో, మార్పులకు అవకాశం లేని కారణంగా ఓంకార్‌ అందుకు ఒప్పుకోలేకపోయారట. దాంతో తమన్నా ప్రాజెక్ట్‌ నుండి తప్పుకుందనీ ఓంకార్‌ చెప్పాడు. అలా ఆ పాత్రలోకి అవికాగోర్‌ వచ్చి చేరింది. తమన్నా నటించి ఉంటే, సినిమా కథ మొత్తం తమన్నా లీడ్‌ రోల్‌ చుట్టూ సాగేది. అశ్విన్‌ ఇంపార్టెంట్‌ రోల్‌ పోషించినట్లు అయ్యేది.

 

కానీ, అవికా చేరికతో, అశ్విన్‌బాబు హీరో అయ్యాడు. ఏది ఏమైతేనేం, ఈ సినిమా వంకతో అవికాకి మళ్లీ తెలుగులో రీఎంట్రీ ఇచ్చే అవకాశం దక్కింది. ఓక్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో ఈ సినిమాని ఓంకార్‌ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. ఈ వారం పెద్దగా సినిమాలేమీ లేని కారణంగా రాజుగారి మూడో గదిలోకి ఆడియన్స్‌ ఓ మోస్తరుగా ఎట్రాక్ట్‌ అయ్యే అవకాశం లేకపోలేదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS