'వైఫ్‌ఐ' ఆ టైప్‌ సినిమా కాదంట!

మరిన్ని వార్తలు

'ఏడు చేపల కథ' సినిమాతో కాదు, టీజర్‌తో సెన్సేషన్‌ అయిన హీరో అభిషేక్‌ రెడ్డి తాజాగా నటిస్తున్న చిత్రం 'వైఫ్‌ ఐ'. వైఫ్‌ ఈజ్‌ బెటర్‌ దేన్‌ నైఫ్‌ అనే క్యాప్షన్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. మొన్న విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, లేటెస్ట్‌గా విడుదలైన టీజర్‌లు సినిమాని బోల్డ్‌ కంటెంట్‌ మూవీగా ప్రమోట్‌ చేస్తున్నాయి. కానీ, ఈ సినిమాలో కంటెంట్‌ అలా ఉండదంటున్నారు దర్శక, నిర్మాతలు. భార్య భర్తల మధ్య రొమాంటిక్‌ ఎమోషన్స్‌ని చూపించే క్రమంలో టీజర్‌ అలా కట్‌ చేయాల్సి వచ్చింది.

 

అయినా అలా చూపించకపోతే ఇప్పుడు ఆడియన్స్‌ని ధియేటర్స్‌కి రప్పించలేపోతున్నాం.. కానీ, సినిమాలోని అసలు కంటెంట్‌ అది కాదనీ ఈ జనరేషన్‌కి సంబంధించిన ఓ ఇంపార్టెంట్‌ పాయింట్‌ చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుందనీ చెబుతున్నారు. కేవలం భార్య భర్తలే కాదు, ఈ జనరేషన్‌ ప్రతీ అమ్మాయి, అబ్బాయి చూడదగ్గ సినిమా ఈ 'వైఫ్‌ ఐ' అని చెబుతున్నారు. సోషల్‌ కాజ్‌తో ఈ సినిమాని తెరకెక్కించారట. అభిషేక్‌ రెడ్డి, సాక్షి నిదియా జంటగా నటించారు.

 

వీరిద్దరే సినిమాకి కీలకం. ఎలాంటి దాపరికాలు లేకుండా భార్య భర్తల తమలోని అన్ని ఎమోషన్స్‌ని ఎలా పంచుకుంటారో, ఆ ఫీలింగ్స్‌ అన్నింటినీ, ఖచ్చితంగా అలాగే నేచురల్‌గా పండించడంలో ఈ ఇద్దరూ సక్సెస్‌ అయ్యారనీ దర్శకుడు చెబుతున్నాడు. అయితే విడుదలయ్యాక సినిమాకి ఎలాంటి రిజల్ట్‌ కట్టబెడతారో చెప్పలేం కానీ, లేటెస్ట్‌గా రిలీజ్‌ అయిన టీజర్‌కి సోషల్‌ మీడియాలో హ్యూజ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. జి.ఎస్‌.ఎస్‌.పి. కళ్యాణ్‌ ఈ సినిమాకి దర్శకుడు. గతంలో రేష్మీతో 'అంతం' అనే సినిమాని తెరకెక్కించిన దర్శకుడే ఈ కళ్యాణ్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS