'ఏడు చేపల కథ' హీరో అభిషేక్ రెడ్డి 'వైఫ్ ఐ' గ్రాండ్ రిలీజ్!

మరిన్ని వార్తలు

'ఏడు చేపల కథ' లో టెంప్ట్ రవి గా నటించి ఒక్క టీజర్ తోనే భారీ పాపులారిటీ సంపాదించిన హీరో అభిషేక్ రెడ్డి. ఈ మధ్యే ఆ సినిమా కూడా విడుదలై మంచి సక్సెస్ అయ్యింది. ఇప్పుడు మరో సినిమా తో అభిషేక్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా అభిషేక్ నటించిన కొత్త సినిమా ‘వైఫ్ఐ’ . ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. పావులర్ అయ్యింది. ఈ సినిమాలో గుంజన్.. ఫిదా గిల్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు, నూతన దర్శకుడు జీ.ఎస్.ఎస్.పీ కళ్యాణ్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు.

 

జనవరి 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ప్రముఖ నిర్మాణ సంస్థ సార్ధక్ మూవీస్ సొంతం చేసుకుంది. నిర్మాత ప్రశాంత్ గౌడ్ వైఫ్ ఐ చిత్రాన్ని సార్ధక్ మూవీస్ ద్వారా విడుదల చేయబోతున్నారు. వైఫ్ ఐ అంటే కేవలం భార్య భర్తలే కాదు, ఈ జనరేషన్‌ ప్రతీ అమ్మాయి, అబ్బాయి చూడదగ్గ సినిమాగా ఈ 'వైఫ్‌ ఐ' ని తీర్చిదిద్దారు దర్శకులు జి.ఎస్.ఎస్.పి కళ్యాణ్.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS