'యాత్ర' సమరశంఖం సెప్టెంబర్‌ 2న.!

మరిన్ని వార్తలు

దివంగత కాంగ్రెస్‌ నేత వైఎస్‌. రాజశేఖర్‌రెడ్డి జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం 'యాత్ర'. ఆల్రెడీ విడుదలైన ఈ సినమా ఫస్ట్‌లుక్‌ అందర్నీ ఎట్రాక్ట్‌ చేసింది. సెప్టెంబర్‌ 2న రాజశేఖర్‌ రెడ్డి వర్ధంతి సందర్భంగా అదే రోజు ఈ సినిమా ఫస్ట్‌ లిరికల్‌ వీడియో రిలీజ్‌ చేయనున్నారు. సీతారామశాస్త్రి రచనలో రూపొందిన ఈ ఆడియో సింగిల్‌ సినిమాకి హైలైట్‌ కానుందట. 

'ఆనందోబ్రహ్మ' ఫేం మహి.వి.రాఘవ దర్శకత్వకంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రముఖ మలయాళ నటుడు ముమ్ముట్టి టైటిల్‌ పాత్ర పోషిస్తున్నాడు. రాజశేఖర్‌ రెడ్డి పాత్రలో ముమ్ముట్టి చక్కగా ఒదిగిపోయారు. రాజశేఖర్‌ రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం, రాజకీయాల్లో ఆయన సాధించిన పురోగతి, ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా జనంలో ఆయన పొందిన అభిమానంతో పాటు రాజకీయ ప్రస్థానానికి ముందు రాజశేఖర్‌ రెడ్డి ఏంటి? అనే అంశాలను కూడా ఈ చిత్రంలో చూపించనున్నారట. 

ముఖ్యంగా సీఎం అవ్వడానికి ముందు ఆయన చేసిన పాదయాత్ర సన్నివేశాలు కీలకంగా చూపించనున్నారట. ముఖ్యమంత్రిగా కోట్ల మంది ప్రజల మన్ననలు పొందిన ఆయన అనుకోకుండా జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో ప్రాణాలు విడిచారు. ఈ ఘట్టాలను తెరపై హృద్యంగా తెరకెక్కించనున్నారట. 

ఆయన కుమారుడు, ప్రస్తుత వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్‌ పాత్రలో తమిళ హీరో కార్తీ నటిస్తున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఆ విషయంలో ఇంకా అఫీషియల్‌ క్లారిటీ రాలేదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS