మనసు గెలచుకున్న 'జవాన్‌'

మరిన్ని వార్తలు

మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ అందరి మనసు దోచుకున్నాడు. ఏదో సినిమాతోనో, పర్‌ఫామెన్స్‌తోనో కాదండోయ్‌. తాజాగా షార్‌ కేంద్రం నుండి పోలార్‌ శాటిలైట్‌ లాంఛ్‌ వెహికల్‌ సీ 38 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైన విషయమై సాయి ధరమ్‌ తేజ్‌ స్పందించాడు. ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించాడు. ఓ సినిమా 50 రోజులు ఆడితేనో, ఓ క్రికెటర్‌ 50 పరుగులు సాధిస్తేనో గొప్ప కాదు. మన ఇస్రో 50 శాటిలైట్లను ఒకేసారి నింగిలోకి పంపడం అసలు సిసలైన గొప్పతనం. అదే జరిగిందిప్పుడు. అందుకు మనమంతా గర్వపడాలి అని ఇస్రో శాస్త్రవేత్తలను కృషికి సలాం చేశాడు సాయి ధరమ్‌ తేజ్‌. సాయి ధరమ్‌ తేజ్‌కి కేవలం సినిమా నాలెడ్జే కాదండోయ్‌. సామాజికి అంశాలపైనా బోలెడంత నాలెడ్జ్‌ ఉంది. కరెంట్‌ అఫైర్స్‌ అంటే చాలా ఇంట్రెస్ట్‌ అట సాయి ధరమ్‌ తేజ్‌కి. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ అందరితోనూ కలిసిపోతూ ఉంటాడు సాయి ధరమ్‌ తేజ్‌. అందుకే సినీ రంగంంలోనే కాకుండా ఇతర రంగాల్లో కూడా తేజుకి స్నేహ సంబంధాలున్నాయి. ప్రస్తుతం మనోడు 'జవాన్‌' సినిమాలో నటిస్తున్నాడు. బివిఎస్‌ రవి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెకెక్కుతోంది. 'కృష్ణగాడి వీరప్రేమగాధ' ఫేం మెహరీన్‌ కౌర్‌ ఈ సినిమాలో తేజుతో జత కడుతోంది. రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రతీ ఇంటికి జవాన్‌ లాంటోడు అండగా ఉంటే ఎంత బాగుంటుందో ఈ సినిమా ద్వారా చూపించనున్నారట డైరెక్టర్‌ బివిఎస్‌. రవి. తేజు ఈ సినిమాలో సరికొత్తగా కనిపించనున్నాడట. ఈ ఏడాది 'విన్నర్‌'తో అలరించిన తేజు త్వరలో 'జవాన్‌'గా రానున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS