తెలుగు కోసం విజయ్-సాయి ధరం డాన్సులు

మరిన్ని వార్తలు

ఈ నెల 15వ తేదీ నుండి ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్ నందు చాలా వైభవంగా జరగనున్నాయి.

ఈ నేపధ్యంలోనే హీరోలు విజయ్ దేవరకొండ, సాయి ధరం తేజ్ లు ఈ తెలుగు మహాసభల కోసం ప్రత్యేకంగా రూపొందిస్తున్న పాటలలో యాక్ట్ చేస్తున్నారు. ఈ పాటలకి దర్శకులు హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. 

త్వరలోనే ఈ పాటలు విడుదల కానున్నాయి. ఇప్పటికే ఈ పాటల చిత్రీకరణ జరుగుతుండగా, ఈ పాటలకి సాహిత్యం రాసింది ప్రముఖ పాటల రచయత అయిన చంద్రబోస్. ఇక ఈ పాటలు ఎలా ఉండబోతున్నాయి అన్న ఆసక్తి అందరిలోను నెలకొని ఉంది.

మొత్తానికి విజయ్, సాయి ధరం లు ఇలా తెలుగు భాష కోసం చేసిన పాటల్లో పాల్గొనడం నిజంగా అభినందించదగ్గ విషయం.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS