దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో కీర్తి సురేశ్‌, ఆది పినిశెట్టి, జ‌గ‌ప‌తిబాబు!

మరిన్ని వార్తలు

హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో కీర్తి సురేశ్‌, ఆది పినిశెట్టి, జ‌గ‌ప‌తిబాబు కాంబినేష‌న్‌లో బాలీవుడ్ ద‌ర్శ‌కుడు న‌గేశ్ కుకునూర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న స్పోర్ట్స్ రొమెడీ చిత్రం `హైద‌రాబాద్ బ్లూస్‌`,`ఇక్బాల్‌` వంటి సినిమాల‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన బాలీవుడ్ డైరెక్ట‌ర్ న‌గేశ్ కుకునూర్‌. ఈయ‌న కీర్తి సురేశ్‌, ఆది పినిశెట్టి, జ‌గ‌ప‌తిబాబు కాంబినేష‌న్‌లో రూపొందుతోన్నచిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగు పెడుతున్నారు.

 

స్పోర్ట్స్ రొమెడీ జోన‌ర్‌లో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది. ఆగ‌స్ట్‌లో చివ‌రి షెడ్యూల్‌ను చిత్రీక‌రించ‌నున్నారు. మంచి కంటెంట్ ఉన్న చిత్రాల‌కు స‌పోర్ట్ చేసే హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమా స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి చిరంత‌న్ దాస్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS