కుర్రాడు కొడతాడా ఈ సారైనా.!

మరిన్ని వార్తలు

'ఆంధ్రా పోరీ' సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు క్రియేటివ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్‌ తనయుడు ఆకాష్‌ పూరీ. తొలి సినిమాతో ఆకట్టుకోలేకపోయాడు. తర్వాత తండ్రి స్వీయదర్శకత్వంలో భారీ అంచనాల నడుమ తెరకెక్కిన 'మెహబూబా' కూడా నిరాశపరిచింది. కానీ నటుగా ఈ సినిమాతో మంచి మార్కులు వేయించుకున్నాడు ఆకాష్‌ పూరీ. బాల నటుడిగా పలు చిత్రాల్లో నటించిన అనుభవం ఉన్న ఆకాష్‌ తాజాగా మరో కొత్త ప్రాజెక్ట్‌ని టేకప్‌ చేశాడు. 

 

ఈ ప్రాజెక్ట్‌కి కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాణం అన్నీ పూరీనే. కానీ అనిల్‌ పాడూరిని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు పూరీ. పూరీ కనెక్ట్స్‌ బ్యానర్‌లో పూరీ జగన్నాధ్‌, ఛార్మి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. గతంలో కూడా పలు చిత్రాలకు దర్శకత్వం లేకుండా కథ, మాటలు అందించాడు పూరీ జగన్నాధ్‌. తమ్ముడు సాయిరామ్‌ శంకర్‌ సినిమాలకు ఈ విధమైన బాధ్యతలు నిర్వహించాడు పూరీ. 

 

ఇప్పుడు తనయుడి కోసం కూడా అన్నీ తానై, దర్శకత్వం ఛాన్స్‌ వేరొకరికి ఇస్తున్నాడు. స్వీయ దర్శకత్వంలో ఆకాష్‌కి హిట్‌ ఇవ్వలేకపోయాడు. చూడాలి మరి ఈ సారైనా ఆకాష్‌ హిట్టు కొడతాడేమో. 'మెహబూబా'తో నేహాశెట్టిని హీరోయిన్‌గా పరిచయం చేసిన డేరింగ్‌ డైరెక్టర్‌ పూరీ ఇప్పుడు ఏ ముద్దుగుమ్మని దించుతాడో. ఈ సినిమాకి 'రొమాంటిక్‌' అనే యూత్‌ఫుల్‌ టైటిల్‌ని ఫిక్స్‌ చేశారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS