సీనియర్ హీరోయిన్లు ఇప్పుడు పవర్ ఫుల్ రోల్స్తో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే, సీనియర్ నటి ఖుష్బూ ఎప్పుడో రీ ఎంట్రీ ఇచ్చేసిన సంగతి తెలిసిందే. 'అజ్ఞాతవాసి' సినిమాలో పవన్ కళ్యాణ్కి పిన్నిలా నటించారావిడ. ఇప్పుడిప్పుడే మంచి పాత్రలు వస్తే, కంటిన్యూస్గా సినిమాలు చేయడానికి ట్రై చేస్తున్నారు. బేసిక్గా ఆవిడ నటి మాత్రమే కాకుండా, నిర్మాతగానూ వెలుగొందుతున్నారు. అన్నింటికీ మించి ప్రముఖ దర్శకుడు సుందర్.సి సతీమణి ఆవిడ. అయితే, ఖుష్బూతో సినిమా చేయాలంటే కొంత ఖర్చుతో కూడుకున్నదేనట.
కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా పాఠించడంతో పాటు, రెమ్యునరేషన్ కూడా ఎక్కువే డిమాండ్ చేస్తారట. గతంలో ఖుష్బూ తెలుగులో ఓ టీవీ ఛానెల్ రియాల్టీ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇప్పుడు కూడా ఓ టీవీ ఛానెల్ సీరియల్లో నటిస్తున్నారు ఖుష్బూ. అయితే, ఫ్యూచర్లో మళ్లీ తెలుగులో నటిస్తారా.? అని అడిగితే, మంచి పాత్రలు వస్తే, ఖచ్చితంగా నటిస్తా అని చెబుతున్న ఖుష్బూ ఫేవరేట్ హీరో ఎవరో తెలుసా.? జూనియర్ ఎన్టీఆర్ అట. ఆయనను చూస్తే ఎక్కడ లేని ఉత్సాహం తన్నుకొస్తుందట. అంతేకాదు, స్క్రీన్పై ఎన్టీఆర్ ఏడిస్తే, తనకూ కన్నీళ్లు వచ్చేస్తాయని ఖుష్బూ చెప్పడం విశేషం. అంటే, ఎన్టీఆర్ అడిగితే, ఆయన సినిమాలో ఖుష్బూ నటించే అవకాశాలున్నాయన్న మాట. ఏమో ఇన్ ఫ్యూచర్ ఈ కాంబినేషన్ వర్కవుట్ అవుతుందేమో చూద్దాం.