కంటతడి పెట్టిన ఐశ్వర్య

మరిన్ని వార్తలు

ఈ మధ్యకాలంలో నటి ఐశ్వర్య రాయికి మీడియా ప్రతినిధులతో ఎందుకో గాని సఖ్యత కుదరటం లేదు. 

వివరాల్లోకి వెళితే, ఐశ్వర్య రాయి తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా వినికిడి సమస్యలతో భాదపడుతున్నఒక 100 చిన్నారులకి శస్త్రచికిత్స చేయించింది. అది పురస్కరించుకొని వారితో గడిపేందుకు తన తల్లి, కూతురితో అక్కడికి చేరుకున్నారు. 

అయితే అక్కడికి చేరుకున్నాక  మీడియా ప్రతినిధులు ఒక్కసారిగా వారిని చుట్టుముట్టి ఫోటోలు తీస్తుండడం ఆమెకి సహనం కోల్పోయేలా చేసింది. దయచేసి నేను ఇక్కడికి వచ్చిన పని తెలుసుకోండి, ఇదేమి సినిమా ఈవెంట్ కాదంటూ తన ఆవేదన వ్యక్తం చేస్తూ కంటతడి కూడా పెట్టుకుంది.

ఈ చిన్నారుల లాగే తన తండ్రికి కూడా పుట్టుకతో వినికిడి సమస్యతో భాదపడ్డారు అని అందుకే ఆయన జ్ఞాపకార్ధంగా తను ఈ పని చేస్తున్నట్టు చెప్పారు.

మొన్నీమధ్యనే తన భర్త అభిషేక్ తో కలిసి బయటకి వెళ్ళినప్పుడు ఫోటోగ్రాఫర్లు తమ అనుమతి లేకుండా ఫోటోలు తీసినందుకు అభిషేక్ ఆగ్రహానికి గురయ్యాడు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS