అతిలోక సుందరి జాన్వీకపూర్కి కూసింత ఫాలోయింగ్ ఎక్కువే. అదేనండీ కెమెరా ఫాలోయింగ్. జాన్వీ ఇంట్లోంచి వీధిలోకి ఎప్పుడెప్పుడు అడుగు పెడుతుందా.? కెమెరా క్లిక్మనిపించాలా.? అని ఎదురు చూస్తుంటారు. నిజానికి స్పెషల్ ఫోటో షూట్స్ కన్నా జాన్వీకి ఇలా క్లిక్ మన్న స్టిల్సే ఎక్కువ. అవే నెట్టింట్లో ఎప్పటికప్పుడే ఫ్రెష్గా హల్చల్ చేస్తుంటాయి. ఎంతైనా స్టార్ కిడ్ కదా. అయితే ఈ చర్య ఒక్కోసారి వారికి అభ్యంతరకరంగా మారుతోంది. ఒక్క జాన్వీకే కాదు, చాలా మంది స్టార్ కిడ్స్కీ తప్పడం లేదిది.
తాజాగా బాలీవుడ్ నటుడు అజయ్దేవగణ్ తనయకు కూడా ఇప్పుడీ సమస్య వెంటాడింది. అజయ్దేవగణ్ - కాజల్ దంపతులకు ఇద్దరు పిల్లలు. వారిలో నాస్య పెద్ద కూతురు. ఆమె పొట్టి నిక్కరు వేసుకుని అలా వీధిలో నడిచి వెళుతున్న ఫోటో ఒకటి కెమెరా కంటికి చిక్కింది. కొన్ని నిముషాల్లోనే ఆ ఫోటో నెట్టింట్లో వైరల్ అయిపోయింది. ఆ ఫోటోపై ట్రోల్స్ స్టార్ట్ అయిపోయాయి నెటిజన్స్ నుండి. దాంతో అజయ్దేవగణ్ స్పందించాల్సి వచ్చింది.
స్టార్కిడ్స్ అన్నాక కొంచెం క్యూరియాసిటీ ఉండడం సహజమే కానీ, నాస్య ఇంకా చిన్న పిల్ల. జస్ట్ 14 ఇయర్స్ మాత్రమే. క్యాజువల్గా బయటికి వచ్చినప్పుడు వారి డ్రస్ సెన్స్ బేస్ చేసుకుని నెటిజన్లు ఇలా ట్రోల్ చేయడం తగదని అజయ్ దేవగణ్ నెటిజన్స్పై గుస్సా అయ్యారు. ఓ ఫేమ్కి వచ్చాక హీరోయిన్స్ని ట్రాల్ చేస్తే వారికి ఫ్రీగా ఏదో పబ్లిసిటీ ఇచ్చినట్లవుతుంది. కానీ మరీ ఇంతిలా స్టార్ కిడ్స్ని ట్రోల్ చేస్తే ఆ స్టార్ పేరెంట్స్ ఇలాగే రెస్పాండ్ అవుతారు మరి, ఏం నెటిజన్స్ అంతేగా.. అంతేగా..!