వెనకడుగు వేసేది లేదంటోన్న అక్కినేని హీరో.!

మరిన్ని వార్తలు

వరుసగా డిజాస్టర్స్‌ వెంటాడుతున్నాయి. అయినా కానీ ఈ సారి అఖిల్‌ వెనక్కి తిరిగి చూడనంటున్నాడు. వరుస సినిమాలతో దూసుకెళ్తానంటున్నాడు. వరుసగా యూత్‌ఫుల్‌ స్టోరీస్‌తో ఆకట్టుకుంటానని ఫ్యాన్స్‌కి హామీ ఇస్తున్నాడు. ఫెయిల్యూర్స్‌ చెప్పిన పాఠాలతో సక్సెస్‌ కోసం ముందడుగు వేయడానికి ప్రయత్నిస్తానంటున్నాడు. గత రెండు చిత్రాలతో పోల్చితే అఖిల్‌కి 'మిస్టర్‌ మజ్ను' కాస్త ఊరటనిచ్చిందనే చెప్పాలి. అంతేకాదు, ఈ సినిమాతో అఖిల్‌ చాలా నేర్చుకున్నాడట. 

 

అందుకే ఇకపై గ్యాప్‌ తీసుకోకుండా సినిమాలు చేయాలనుకుంటున్నాడట. నాగార్జున కూడా అఖిల్‌కి ఇదే సూచిస్తున్నాడట. ఈ కోణంలో అఖిల్‌ కోసం ఆల్రెడీ చాలా స్టోరీలు లైన్‌లో ఉన్నాయి. అయితే ఇంతవరకూ వాటిని చర్చల దశలోనే ఉంచేశాడట అఖిల్‌. వాటిలోంచి కొన్ని బెటర్‌ స్టోరీస్‌ని ఇప్పుడు సెలెక్ట్‌ చేసి, తెరపై ఆవిష్కరించే యోచనలో అఖిల్‌ ఉన్నట్లు తెలుస్తోంది. కొంతమంది కొత్త డైరెక్టర్లు ఈ లిస్టులో ఉన్నారట. అలాగే ప్రస్తుతం అంత ఫామ్‌లో లేని సీనియర్‌ డైరెక్టర్స్‌ కూడా ఉన్నారట. అటూ ఇటూ సమానంగా ఓటేసే ప్లాన్‌ చేస్తున్నాడట. 

 

అంటే కొత్త డైరెక్టర్‌తో ఓ సినిమా, సీనియర్‌ డైరెక్టర్‌తో ఇంకో సినిమా చేయబోతున్నాడనీ విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌. ఈ రెండు సినిమాల విషయంలోనూ త్వరలోనే అఖిల్‌ ఓ క్లారిటీకి రానున్నాడనీ తెలుస్తోంది. మరోవైపు 'అమర్‌ అక్బర్‌ ఆంటోనీ' సినిమాతో రీసెంట్‌గా ఫెయిల్యూర్‌ చవిచూసిన శీను వైట్ల అఖిల్‌కి స్పోర్ట్స్‌ నేపథ్యంలో ఓ స్టోరీ లైన్‌ వినిపించాడట. ఆ కథపై అఖిల్‌ ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నాడనీ టాక్‌. అంటే త్వరలోనే అఖిల్‌ నుండి కొత్త సినిమా అనౌన్స్‌మెంట్‌ రానుందన్న మాట.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS