'నిధిఅగర్వాల్‌' కి తృటిలో తప్పిన ప్రమాదం..!

మరిన్ని వార్తలు

అక్కినేని అఖిల్‌ హీరో అన్న సంగతి తెలిసిందే. కానీ రియల్‌ హీరో అన్న సంగతి తెలుసా.? ఇప్పుడు తెలుసుకోవాలి. సినిమాల్లో హీరోయిన్స్‌ని హీరోలు సాహసాలు చేసి మరీ కాపాడేస్తుంటారు ఇది తెర సంగతి. కానీ నిజంగా ఇలా చేస్తారా.? చేయగలరా.? అఖిల్‌ చేశాడు. 

 

షూటింగ్‌ సమయంలో యాక్సిడెంటల్‌గా ఓ పెద్ద పోల్‌కున్న లైట్‌ ఒకటి తనమీద పడుతుంటే, అఖిల్‌ చాకచక్యంగా వ్యవహరించి హీరోయిన్‌ అయిన నిధి అగర్వాల్‌ని రక్షించాడట. అలా అఖిల్‌ అడ్డు రాకుంటే చాలా పెద్ద ప్రమాదమే జరిగేదట. అఖిల్‌ చేసిన ఈ రియల్‌ సాహసం ఆయనలోని రియల్‌ హీరోయిజాన్ని బయట పెట్టింది. ప్రస్తుతం నిధి అగర్వాల్‌, అఖిల్‌ జంటగా 'మిస్టర్‌ మజ్ను' చిత్రం రూపొందుతోంది. 

 

'తొలిప్రేమ' ఫేం వెంకీ అట్లూరి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. జనవరి 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. శరవేగంగా సినిమా షూటింగ్‌ పనులు జరుగుతున్నాయి. దాదాపు చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రమోషన్స్‌లో పాల్గొననుంది. అఖిల్‌కి మూడో చిత్రంగా ఈ 'మిస్టర్‌ మజ్ను' రూపొందుతోన్న సంగతి తెలిసిందే. 'సవ్యసాచి'తో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ నిధి అగర్వాల్‌కి 'మిస్టర్‌ మజ్ను' రెండో సినిమా. తొలి సినిమా 'సవ్యసాచి'తో హిట్‌ అందుకోలేకపోయిందీ ముద్దుగుమ్మ. ఈ సారైనా హిట్‌ కొడుతుందేమో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS