ఆ విషయంలో క్షమాపణ కోరుతున్న రంగమ్మత్త..!

మరిన్ని వార్తలు

జబర్ధస్త్ యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులకి బాగా పాపులర్ అయిన 'అనసూయ' వెండితెర పై 'క్షణం' సినిమా ద్వారా నటిగా మంచి పేరు తెచ్చుకుంది. 2018 సంవత్సరంలో రామ్ చరణ్-సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగస్థలం' సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. నటన పరంగా రామ్ చరణ్ కి ఈ సినిమా మంచి గుర్తింపు తెచ్చింది. అలాగే ఈ సినిమా లో రంగమ్మత్త పాత్ర పోషించిన అనసూయ కి కూడా మంచి పేరు వచ్చింది. 

 

రంగమ్మత్త పాత్రలో లీనమైపోయి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులని మెప్పించినందుకుగాను 'జీ సినీ అవార్డ్స్ 2018' వేడుకలో అనసూయ అవార్డుని అందుకుంది. జీ టీవీ వారి నుండి తొలి అవార్డు అందుకున్న ఆనందాన్ని తన ఇన్ స్టాగ్రామ్ పేజీ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. అలాగే, తన విన్నింగ్ స్పీచ్ ని డిజాస్టర్ గా వర్ణించి 'అవార్డు అందుకున్న ఆనందంలో సరిగా మాట్లాడలేకపోయాను. ఈ అవార్డు అందుకునేందుకు నాకు సహకరించిన నా చిట్టిబాబు, డైరెక్టర్ సుకుమార్ గారు, మైత్రి మూవీ మేకర్స్, డీఎస్పీ, రత్నవేలు సార్, నా భర్త, మా అమ్మానాన్నలు, నా పిల్లలు మరియు రంగస్థలం సినిమా యూనిట్ అందరికీ థాంక్స్ చెప్పటం మర్చిపోయాను. మీరంతా నన్ను క్షమించాలి.. అంటూ ఒక పోస్ట్ పెట్టింది. 

 

ఇదిలా ఉండగా, ఈ అవార్డు అందుకున్నందుకు గాను ఫాన్స్ అనసూయ మీద ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. మీరు ఇలాంటి అవార్డులు మరెన్నో అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అంటూ కామెంట్స్ ద్వారా తమ అభినందనలు తెలియచేస్తున్నారు. రంగమ్మత్త గా వచ్చిన పేరుతో అనసూయకి సినిమా అవకాశాలు బాగా వస్తున్నాయి. త్వరలో అనసూయ నటించిన వైఎస్ఆర్ బయోపిక్ 'యాత్ర', వెంకటేష్, వరుణ్ ల 'F2' సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే, మరికొన్ని చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS