'అర్జున్‌'కి 'వారు' కలిసి రావడం లేదా?

మరిన్ని వార్తలు

నిఖిల్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం 'అర్జున్‌ సురవరం'. ఎప్పుడో విడుదల కావల్సి ఉంది. కానీ, వెంటాడిన ఆటంకాల నేపథ్యంలో ఈ సినిమా అటూ ఇటూ కాకుండా అర్ధాంతరంగా ఆగిపోయింది. ఎట్టకేలకు అన్ని చిక్కులూ విడిపించుకుని, ఈ నెల 29న విడుదలకు సిద్ధమైంది. ఒక రకంగా నిఖిల్‌ ఫ్యాన్స్‌కిది హ్యాపీ న్యూస్‌ అయినా, ఎందుకో ఈ సినిమా ప్రమోషన్స్‌పై చిత్ర యూనిట్‌ అంతగా శ్రద్ధ పెట్టడం లేదు. సోషల్‌ మీడియా వేదికగా నిఖిల్‌ ఒక్కడే ఏదో అలా అలా ప్రమోట్‌ చేస్తున్నాడు. కానీ, అది చాలదు.

 

ఈ రోజుల్లో ప్రమోషన్స్‌ లేకుంటే ఎంత భారీ బడ్జెట్‌ మూవీ అయినా ఢమాల్‌ అనడం ఖాయం. అలాంటిది ఓ మోస్తరు సినిమాలకు భారీ ఎత్తున ప్రమోషన్స్‌ ఉండాల్సిందే. మొదటిసారి రిలీజ్‌ కోసమని సినిమాని భారీగా ప్రమోట్‌ చేశారు. కానీ, విడుదల లేట్‌ కావడంతో, ఆ ప్రమోషన్స్‌ కూడా 'లేటు' లిస్టులోకి వెళ్లిపోయాయి. అటూ ఇటూగా 20 రోజులు కూడా లేని 'అర్జున్‌ సురవరం' ఏదో ఒకటి చేసి, స్పీడు పెంచకపోతే కష్టమే మరి.

 

టి. సంతోష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించింది. పవర్‌ ఫుల్‌ రిపోర్టర్‌ పాత్రలో నిఖిల్‌ కనిపిస్తున్నాడు ఈ సినిమాలో. కంటెంట్‌ పరంగా సినిమా ఆసక్తిగానే ఉంది. మరి ఆ ఆసక్తి మరింత పెరిగేలా నిఖిల్‌ గట్టిగా ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. సోషల్‌ మీడియా వేదికగా నిఖిల్‌ ఫ్యాన్స్‌ కూడా ఇదే సూచిస్తున్నారట. కానీ, నిఖిల్‌ చేతిలో ఏముంది. ఏం చేయాలన్నా.. చిత్ర నిర్మాతలు కదా చేయాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS