మహేష్ పైన బాలయ్య అభిమానులు గరంగరం..

మరిన్ని వార్తలు

నటసింహం బాలకృష్ణ జై సింహ నిన్న విడుదలవ్వడంతో పాటు యావరేజ్ టాక్ కూడా సొంతం చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు జై సింహ చిత్రానికి సంబందించిన ఒక రివ్యూ పట్ల బాలయ్య అభిమానులు గరంగరంగా ఉన్నారు.

ఇంతకి ఆ రివ్యూ చెప్పింది ఎవరంటే- మహేష్ కత్తి. ఈయన ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ అభిమానులతో గొడవ కారణంగా ఈయన వార్తల్లో వ్యక్తిగా నిలవడం కూడా మనం చూశాము. అలాంటిది ఆయన ఇప్పుడు బాలకృష్ణ జై సింహ రివ్యూ చెప్పడం, అందులో ఈ చిత్రం పాత కథ అని అనడం అలాగే సినిమా కూడా బాగాలేదు అని నిర్మొహమాటంగా చెప్పేశాడు.

ఇక ఇది నచ్చని బాలయ్య అభిమానులు వెంటనే ఆయన పైన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. కొంతమంది ఏకంగా ధైర్యం ఉంటే జై సింహ ప్రదర్శిస్తున్న ధియేటర్ వద్దకి వచ్చి రివ్యూ ఇవ్వమని బెదిరించడం కూడా చేస్తున్నారు. 

ఇది చూస్తుంటే, మహేష్ కత్తి పైన అటు పవన్ ఇటు బాలయ్య అభిమానులు కోపంగా ఉన్నారు అని అర్ధమవుతున్నది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS