బిగ్‌బాస్‌లో పుల్లల మంట చల్లారదా?

By Inkmantra - August 22, 2019 - 12:00 PM IST

మరిన్ని వార్తలు

అగ్గిపుల్ల అనే అవార్డు ఇచ్చి హోస్ట్‌ నాగ్‌ చాలా తప్పు చేశారనిపిస్తోంది. అదే అవార్డ్‌ అయినా, మీనింగ్‌ మరోటి చెప్పి ఉంటే బాగుండేది నాగార్జున. కానీ, పుల్లలు పెట్టే క్యారెక్టర్‌ మహేష్‌ది అని చెప్పి, హౌస్‌ని చాలా డిస్ట్రబ్‌ చేశాడంటూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇందుకు భారీ మూల్యం చెల్లించుకోవల్సిందే అంటూ.. మహేష్‌ సపోర్టర్స్‌ సోషల్‌ మీడియాలో ఉద్యమం చేసేస్తున్నారు.

 

ఇక హౌస్‌ విషయానికి వస్తే, రకరకాల కేటగిరీల్లో అవార్డులు అందుకున్న ఏ ఒక్కరూ ఫేస్‌ చేయని ప్రాబ్లెమ్‌ మహేష్‌ ఒక్కడే ఫేస్‌ చేస్తున్నాడు ఈ అవార్డు కారణంగా. బాబా భాస్కర్‌ ఇష్యూకి సంబంధించి, సర్ది చెప్పే ప్రయత్నంలో మహేష్‌పై చాలా రూడ్‌గా ప్రవర్తించాడు సాటి కంటెస్టెంట్‌ అయిన అలీ రైజా. అదే ఇష్యూని మళ్లీ మళ్లీ రైజ్‌ చేస్తూ, అలీ మహేష్‌ పాలిట విలన్‌లా ప్రవర్తిస్తున్నాడు. దీంతో హౌస్‌లో వాతావరణం అంతకంతకూ వేడెక్కిపోతోంది.

 

పరిస్థితి చూస్తుంటే, ఈ పుల్లల ఇష్యూ ఇప్పుడప్పుడే చల్లారేలా కనిపించడం లేదు. అలీ, మహేష్‌ మధ్య ఈ సీరియస్‌నెస్‌ ఎంత దూరం పోతుందో కూడా ఊహించడం కష్టంగానే ఉంది. ఇక ఈ అవార్డు ఇచ్చి, హౌస్‌లో ఇంత రచ్చకి కారణమైన హోస్ట్‌ నాగార్జున ఈ వారం ఈ ఇష్యూని ఎలా డీల్‌ చేస్తాడో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS