'విక్రమ్‌ సహిదేవ్‌': కొత్త కుర్రాడొస్తున్నాడు గురూ.!

మరిన్ని వార్తలు

చైల్డ్‌ ఆర్టిస్టులుగా పరిచయమైన పలువురు కుర్రాళ్లు హీరోలుగా తెరంగేట్రం చేశారు. కానీ అందరూ సక్సెస్‌ కాలేదు. అంతెందుకు పూరీ జగన్నాధ్‌ తనయుడు ఆకాష్‌ పూరీ కూడా సక్సెస్‌లో ఇంకా నెక్ట్స్‌ లెవల్‌ని అందుకోలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే తనీష్‌, శ్రీనివాస్‌ సాయి.. ఇలా పలువురు కుర్రాళ్లున్నారు. అయితే తాజాగా ఓ కుర్రాడి పేరు ప్రధమంగా వినిపిస్తోంది. ఆ పేరే 'విక్రమ్‌ సహిదేవ్‌'. ఫిల్మ్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ ఉన్నవాడే. 

 

ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్‌ తనయుడు. 'రేసుగుర్రం' సినిమాలో అల్లుఅర్జున్‌ చిన్నప్పటి పాత్రలో నటించాడు. ఆ తర్వాత 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాలో అన్వర్‌ పాత్రలో పవర్‌ఫుల్‌ పర్‌ఫామెన్స్‌ ఇచ్చాడు. సినిమా విజయవంతం కాలేదు. కానీ ఆ అన్వర్‌ పాత్రను జనం మర్చిపోలేదు. అంతగా తన ప్రభావం చూపించాడు ఆ పాత్రతో విక్రమ్‌ సహిదేవ్‌. ఈ కుర్రాడే ఇప్పుడు సోలో హీరోగా 'ఎవడు తక్కువ కాదు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 

 

లగడపాటి శిరీష సమర్పణలో లగడపాటి శ్రీధర్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రఘు జయ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియాంక జైన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. లేటెస్ట్‌గా విడుదల చేసిన పోస్టర్‌కి మైండ్‌ బ్లోయింగ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. 'ఏ స్టోరీ ఆఫ్‌ బ్రేవ్‌ హార్ట్స్‌' క్యాప్షన్‌తో ఈ సినిమాని చాలా పవర్‌ఫుల్‌గా తెరకెక్కిస్తున్నారట. విక్రమ్‌ సహిదేవ్‌ పవర్‌ఫుల్‌ లుక్సే ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ అంటున్నారు. యాక్షన్‌తో పాటు, యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ లవ్‌స్టోరీగా రూపొందిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS