'ఇస్మార్ట్' పూరీ జోరు తగ్గలేదంతే.!

మరిన్ని వార్తలు

సక్సెస్‌, ఫెయిల్యూర్స్‌ ఎలా ఉన్నా డేరింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్‌లో జోరు మాత్రం తగ్గదు. ప్రస్తుతం తెరకెక్కిస్తున్న 'ఇస్మార్ట్‌ శంకర్‌' షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ డే నుండీ ఓ పక్క సినిమా షూటింగ్‌, ఇంకో పక్క ప్రమోషన్‌ కూడా వదలలేదు పూరీ జగన్నాధ్‌. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ ఇస్తూనే ఉన్నాడు. 

 

గోవా షూటింగ్‌కి సంబంధించిన ఫోటోలనూ, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పంచుకుంటోంది హీరోయిన్‌ కమ్‌ నిర్మాత ఛార్మి. ఈ సినిమాకి డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్‌ అయినా వెనకుండి అంతా తానై బాధ్యత వహిస్తోంది ఛార్మి. క్లైమాక్స్‌కి చేరుకున్న ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ని ఇక రేపో మాపో ప్రకటించనున్నాడు పూరీ జగన్నాధ్‌. ఒకప్పుడు స్టార్‌ డైరెక్టర్‌గా వెలుగొందిన పూరీ జగన్నాధ్‌ని ఈ మధ్య ఫెయిల్యూర్స్‌ వెంటాడుతున్న సంగతి తెలిసిందే. 

 

అయినా కానీ రెట్టించిన ఉత్సాహంతో 'ఇస్మార్ట్‌ శంకర్‌' ప్రాజెక్ట్‌ని టేకప్‌ చేశాడు. అంతకు మించిన ఉత్సాహంతో పూర్తి చేస్తున్నాడు. రామ్‌ హీరోగా రూపొందుతోన్న ఈ సినిమాలో నిధి అగర్వాల్‌, నభా నటేష్‌ ఇస్మార్ట్‌ గాళ్స్‌గా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే, మరోవైపు పూరీ జగన్నాధ్‌ తన కొడుకు ఆకాష్‌ పూరీతో రూపొందిస్తున్న 'రొమాంటిక్‌' మూవీ షూటింగ్‌ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS