'జగదేకవీరుడు' సీక్వెల్‌కి టైమొచ్చింది

మరిన్ని వార్తలు

చిరంజీవి, శ్రీదేవి జంటగా వచ్చిన 'జగదేకవీరుడు అతిలోక సుందరి' సినిమా వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌లో అశ్వనీదత్‌ నిర్మించారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన చిత్రమిది. చిరంజీవి కెరీర్‌లోనే బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టింది. 

అయితే ఆ టైంలోనే ఈ సినిమాకి సీక్వెల్‌ తెరకెక్కించాలని అశ్వనీదత్‌ భావించారు. కానీ కుదరలేదు. తర్వాత చిరంజీవి సినిమాలకు దూరం కావడం, చిరు తనయుడు చరణ్‌ ఎంట్రీ షురూ కావడంతో, చరణ్‌ తొలి సినిమాగా ఈ సీక్వెల్‌నే తెరకెక్కించాలని అనుకున్నారు. అంతేకాదు, శ్రీదేవి కుమార్తై జాన్వీ కపూర్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా తెరంగేట్రం చేస్తుందని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే, తొలి సినిమాకే చరణ్‌కి అంత బరువైన పాత్ర వద్దనీ, ఓ మాస్‌ చిత్రంతో ఎంట్రీ ఇస్తే బావుంటుందనీ పూరీతో 'చిరుత' సినిమా చేయించాడు. 

ఆ తర్వాత చాలాసార్లు ఈ సినిమాకి సీక్వెల్‌ చేయాలని స్క్రిప్ట్‌ కూడా ప్రిపేర్‌ చేశారు. కానీ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కలేదు. ఎలాగైనా చిరంజీవితోనే ఈ సినిమాకి సీక్వెల్‌ చేయాలన్నది అశ్వనీదత్‌ కోరిక. కాగా ఇప్పుడు మళ్లీ చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడంతో, అశ్వనీదత్‌ కోరిక నెరవేరనుందనీ, త్వరలోనే ఈ సీక్వెల్‌ తెరకెక్కబోతోందని తాజాగా ప్రచారం జరుగుతోంది. 

లేటెస్టుగా వైజయంతీ బ్యానర్‌లో వచ్చిన 'మహానటి' చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ సందర్భంగా చిరంజీవి చిత్ర యూనిట్‌ని స్వయంగా ఇంటికి ఆహ్వానించి వారికి అభినందనలు తెలిపారు. ఖచ్చితంగా వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌లో సినిమా చేద్దాం అని మరోసారి హామీ ఇచ్చారు. అదీ సంగతి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS