కమెడియన్ పృథ్వీకి కోర్టులో చుక్కెదురు!

మరిన్ని వార్తలు

ప్రముఖ కమెడియన్ పృథ్వికి ఫ్యామిలీ కోర్టులో చుక్కెదురయ్యింది.

వివరాల్లోకి వెళితే, పృథ్వికి 1984లో శ్రీలక్ష్మి అనే మహిళతో వివాహమయింది, వీరికి ఇద్దరు సంతానం కూడా వున్నారు. అయితే ఈ మధ్య వీరిరువురికి గొడవ జరిగి ఆమెని ఇంటిలోంచి వెళ్లగొట్టినట్టు తెలుస్తుంది.

అయితే ఇరువైపుల పెద్దమనుషులు సర్దిచెప్పడానికి ప్రయత్నించినా వీరి మధ్య గొడవ సద్దుమణగలేదు. దీనితో ఆమె విజయవాడలోని పోలీస్ స్టేషన్ లో నవంబర్ 2, 2016లో పృథ్వీ పై 498A సెక్షన్ క్రింద ఫిర్యాదు చేసింది.

ఈ కేసుని విచారణకు స్వీకరించిన ఫ్యామిలీ కోర్టు పృథ్వికి నోటీసులు కూడా జారీచేసింది. అయితే ఆ నోటీసులకి అతను స్పందించకపోవడం, చివరకి హైదరాబాద్ లో పేపర్ ప్రకటన ఇచ్చినా కోర్టు కి హాజరుకాకపోవడం తో ఆయనను తన భార్య, పిల్లలకి నెలకి రూ.8 లక్షల చొప్పున భరణం చెల్లించాల్సింది గా కోర్టు తీర్పు ఇచ్చింది.

అయితే దీనిపై  పృథ్వీ నుంచి ఇంకా ఎటువంటి స్పందనా రాలేదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS