కోర్టుకి పవన్ కళ్యాణ్ ఎట్టిపరిస్థితుల్లో రావాల్సిందే..!

మరిన్ని వార్తలు

రెండు నెలల క్రితం పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ శ్రీ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. అయితే ఆమె చేసిన పవన్ కళ్యాణ్ తల్లిని ఉదేశ్యించి చేసిన ఒక వ్యాఖ్యని మాత్రం అందరూ తీవ్రంగా గర్హించారు.

ఇక ఆ విషయమై పదే పదే ఆ వార్తని ప్రసారం చేసారంటూ ప్రముఖ వార్తా పత్రిక-టీవీ ఛానల్ ఎం.డి పైన పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ వేదికగా కొన్ని విమర్శలు చేయడంతో పాటుగా సదరు పత్రికా యజమాని ఫోటోని సైతం పోస్ట్ చేయడం జరిగింది. 


దీనికిగాను తనకి బేషరతుగా ట్విట్టర్ ద్వారానే క్షమాపణ చెప్పాలి అని పవన్ కళ్యాణ్ కి సదరు పత్రికా యజమాని లీగల్ నోటిసులు పంపారు. అయితే ఆ నోటిసులని పవన్ కళ్యాణ్ భేఖాతరు చేయడంతో ఆయన పైన రూ 10 కోట్లకు పరువు నష్టం దావా వేయడం జరిగింది.

ఈ కేసుని పరిశీలించిన కోర్టు తదుపరి విచారణ ఈ నెల 24వ తేదీకి వాయిదా వేస్తూ ఆరోజు పవన్ కళ్యాణ్ ని కాని ఆయన తరపు న్యాయవాదిని కాని కోర్టుకి హాజారుకావాల్సిందిగా ఆదేశించారు. మరి పవన్ కోర్టుకి వస్తాడా తన న్యాయవాదిని పంపిస్తాడా అనేది వేచి చూడాలి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS