టాలీవుడ్లో ట్రెండ్ మారింది. మెల్లమెల్లగా బాలీవుడ్ ట్రెండ్ని ఇప్పటి టాలీవుడ్ హీరోలు ఫాలో అవుతున్నట్లే కనిపిస్తోంది. ఒకరి సినిమాలను మరొకరు అభినందించుకోవడం. ఒకరి ఆడియో ఫంక్షన్స్కి మరొకరు వెళ్లడం, యంగ్ హీరోస్ని, సీనియర్ హీరోస్ ప్రోత్సహించడం వంటివి చాలా చేస్తున్నారు. ఈ సాంప్రదాయం మంచిదే.
గతంలో హీరోల మధ్య ఉన్న గ్యాప్కి, వారి వారి అభిమానుల మధ్య కూడా అలాంటి గ్యాప్ క్రియేట్ అవడంతో పాటు, రకరకాల పరిస్థితలుకు కారణమయ్యేది ఆ సాంప్రదాయం. కానీ ఇప్పుడలా కాదు. పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలు, యంగ్ హీరోలైన నితిన్ సినిమాలతో పాటు, సప్తగిరి, సునీల్ వంటి కమెడియన్స్ కమ్ హీరోల సినిమాలకు కూడా తమ ప్రోత్సాహాన్నిస్తున్నారు.
ఇక తాజాగా జరిగిన 'భరత్' ఆడియో ఫంక్షన్కి ఎన్టీఆర్ హాజరైన సంగతి తెలిసిందే. గతంలో కూడా పలువురు యంగ్ హీరోల సినిమా ఈవెంట్స్కి 'బాహుబలి' స్టార్ ప్రబాస్ వచ్చిన సందర్భాలు కూడా అనేకం. అక్కినేని ఫ్యామిలీ సినిమా ఈవెంట్స్కి మెగా హీరోలు హాజరవుతున్నారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా ఏకధాటిపై నడుస్తూ, అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ ట్రెండ్ని అభిమానులకు కూడా స్వాగతిస్తున్నారు.
ఇదిలా ఉండగా, మెగా మల్టీస్టారర్స్కి కూడా రంగం సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. నాగ్, నానిల మల్టీస్టారర్ ఆల్రెడీ రూపుదిద్దుకుంటోంది. శర్వా, నితిన్ కాంబోలో ఓ మల్టీస్టారర్ రానుంది. ఇవన్నీ ఒకెత్తు అయితే, చరణ్, ఎన్టీఆర్ మెగా మల్టీస్టారర్ మరో ఎత్తు. ఈ పరిణామాలన్నీ, ముందు ముందు బాక్సీఫీస్ వద్ద కాసుల పంట పండేందుకేనని సూచనలిస్తున్నాయి.