కీర్తి సురేష్‌ టైమొచ్చేసింది

మరిన్ని వార్తలు

చేసినవి తక్కువ సినిమాలే అయినా యాక్టింగ్‌ టాలెంట్‌లో మంచి పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్‌కి కెరీర్‌ తొలినాళ్లలోనే ఎవ్వరికీ దక్కని అరుదైన అవకాశం దక్కింది. అదే 'మహానటి' సినిమాతో. ఈ సినిమాకి ఎంతో మంది సీనియర్‌ నటీమణుల్ని పరిశీలించి, చివరికి కీర్తి సురేష్‌ని ఏరి కోరి ఎంచుకుంది చిత్ర యూనిట్‌. 

నిజానికి ఆ పాత్రకు తాను న్యాయం చేయలేననీ, ఈ ప్రాజెక్ట్‌ను తాను టేకప్‌ చేయలేననీ కీర్తిసురేష్‌ చెప్పేసిందట. అయితే ఆ పాత్రకు తానే సూటబుల్‌ అని ఈ చిత్ర దర్శకుడు నాగ్‌ అశ్విన్‌, నిర్మాత ప్రియాంకా దత్‌ తదితరులు కీర్తిని పట్టుపట్టి ఒప్పించారట. ఆ తర్వాత సావిత్రి పాత్రకు కీర్తిసురేష్‌ ఏంటి? అని చాలా రకాల విమర్శలను ఎదుర్కొంది కూడా కీర్తి సురేష్‌. కానీ అవేమీ లెక్క చేయకుండా, మొత్తానికి ఈ చిత్రం షూటింగ్‌ జరుపుకుంది. మరో రెండె రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ సందర్భంగా 'మహానటి' ప్రమోషన్స్‌ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇటీవల జరిగిన ఆడియో ఫంక్షన్‌లో కీర్తిని అంతా ప్రశంసలతో ముంచెత్తేశారు. వాట్‌ ఏ ట్రాన్స్‌ఫామేషన్‌ కీర్తి అంటూ అప్పుడే కీర్తించేశారు. ఆల్రెడీ సీతారామశాస్త్రి వంటి సినీ ప్రముఖులు ఈ సినిమాని చూశారట. సినిమాలో కీర్తి సురేష్‌ అప్పియరెన్సే కాదు, నటనతో కూడా పూర్తి న్యాయం చేసిందని వారు చెప్పడం గమనార్హం. అయితే ప్రేక్షకులు ఏమంటారనేది తెలియాలంటే రెండు రోజులు మాత్రమే ఆగాల్సి ఉంది. 

ప్రమోషన్స్‌లోనూ కీర్తి సురేష్‌ మార్కులేయించేసుకుంటోంది. సావిత్రినే తలపించేంత అందంగా చూపుతిప్పుకోలేనంత ఆకర్షణగా ముస్తాబై కనిపిస్తోంది. ఇవన్నీ చూస్తుంటే, 'మహానటి' అంచనాలను అందుకుంటుందనే అనిపిస్తోంది చూడాలి మరి ఏం చేస్తుందో!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS