'ఘాజీ' అదిరిపోయిందట

మరిన్ని వార్తలు

రానా, తాప్సీ జంటగా తెరకుక్కుతోన్న సినిమా 'ఘాజీ'. సంకల్ప్‌ దర్శకత్వంలో ఈ సినిమా హిందీతో పాటు, తెలుగులో కూడా విడుదలవుతోంది. ఈ సినిమా ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకి ముందే సెలబ్రిటీస్‌ కోసంఈ సినిమా ప్రీమియర్‌ షో నిర్వహించారు. ఈ షోకి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. రానా నటన అద్భుతంగా ఉందంటున్నారు సినిమా చూసినవాళ్లు. ఇండియా - పాకిస్థాన్‌ యుద్ధ నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఇండియా - పాకిస్థాన్‌ యుద్ధం అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది కార్గిల్‌ యుద్ధమే. కానీ ఈ సినిమా ద్వారా చరిత్రలో కలిసిపోయిన మరో యుద్ధం గురించి డైరెక్టర్‌ చెప్పబోతున్నాడు. అదే సబ్‌మెరైన్‌ యుద్ధం. ఇండియన్‌ యుద్ధనౌక 'ఎస్‌ 21'కీ, పాకిస్థానీ యుద్ధనౌక 'ఘాజీ'కి మధ్య జరిగే యుద్ధమే ఈ సినిమా. అక్కడక్కడా కొన్ని విజువల్‌ ఎఫెక్ట్స్‌తో సినిమాని అత్యద్భుతంగా తెరకెక్కించారంటూ సినిమా ప్రీమియర్‌ షో చూసిన వాళ్లు ప్రశంసిస్తున్నారు. డైరెక్టర్‌ క్రిష్‌ మరికొంత మంది సెలబ్రిటీస్‌ ఈ సినిమాని తిలకించి, రానాకి కంగ్రాట్స్‌ చెప్పారు. 'బాహుబలి' సినిమా తర్వాత అంత గొప్ప పేరు రానాకి ఈ సినిమా ద్వారా వస్తుందని అంటున్నారు. అలాగే ముద్దుగుమ్మ తాప్సీకి కూడా ఈ సినిమా మరో మంచి సినిమా అవుతుందని అంటున్నారు. ఆకట్టుకునే విజువల్‌ ఎఫెక్ట్స్‌తో అత్యంత గ్రాండ్‌గా ఈ సినిమాని తెరపై ఆవిష్కరించారనీ అంటున్నారు. మొత్తానికి 'ఘాజీ' విడుదలకి ముందే మంచి రెస్పాన్స్‌ అందుకుంటోంది. ఇక విడుదలయ్యాక ఇంకెన్ని ప్రశంసలు అందుకుంటుందో చూడాలిక.

 

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS