పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఓ సినిమా నిర్మించనున్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటన విడుదలైన విషయం విదితమే. ఈ సినిమా గురించి రకరకాల ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చేశాయి. శృతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోందనీ, హరీష్ శంకర్ ఓ రీమేక్ని ప్లాన్ చేశాడనీ.. ఇలా అనేక ఊహాగానాలు విన్పిస్తోంటే, వీలైనంతవరకు వాటిని ఖండిస్తూ వస్తున్నాడు దర్శకుడు హరీష్ శంకర్. అయితే, అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, హరీష్ శంకర్ ప్రస్తుతానికి కథ మీదనే పూర్తి ఫోకస్ పెట్టాడట. నిజానికి, చాలకాలం క్రితమే హరీష్, పవన్ కళ్యాణ్ కోసం కథ చెప్పాడనీ, అప్పట్లో పవన్ ఓకే కూడా చేశారనీ తెలుస్తోంది.
ఈ కథకి మరిన్ని మెరుగులు దిద్దే ప్రక్రియ ప్రస్తుతం నడుస్తోందట. ఎటూ, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా వున్నారు గనుక, హరీష్ శంకర్తో సినిమా కోసం టైవ్ు పట్టొచ్చు. ఈలోగా హరీష్, స్క్రిప్ట్కి సంబంధించి పూర్తిగా సన్నద్ధమయ్యేందుకు వీలు దొరుకుతుంది. ప్రస్తుతానికైతే హీరోయిన్ సహా ఏ విషయాల మీదా దర్శకుడు హరీష్ శంకర్గానీ, నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్గానీ ఓ నిర్ణయం తీసుకోలేదట. అన్నీ కుదిరితే, ఉగాది నాటికి ఈ సినిమాకి సంబంధించి కొన్ని వివరాలు తెలిసే అవకాశముంది. ‘మరీ ఆలస్యం కాదుగానీ, కొన్ని రోజుల సమయం ఖచ్చితంగా పడుతుంది..’ అంటూ పవన్ - హరీష్ కాంబినేషన్లో సినిమా గురించి సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.
హరీష్కి, పవన్ కళ్యాణ్పై వున్న అభిమానం గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈ నేపథ్యంలో, హరీష్ ఈ ప్రాజెక్ట్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాడు.