రెండు రిలీజ్ అయినా 'భరత్‌'కే జై కొట్టారు

మరిన్ని వార్తలు

ఈ రోజు రెండు సినిమాలు విడుదలయ్యాయి. కానీ గత వారం రిలీజైన 'భరత్‌ అనే నేను' చిత్రం ఈ వారం కూడా వసూళ్లు కొల్లగొట్టేస్తోంది. మంచు విష్ణు నటించిన 'ఆచారి అమెరికా యాత్ర', ఒకటి నాగశౌర్య - సాయి పల్లవి నటించిన 'కణం' చిత్రాలు ఈ రోజు తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అయినా మహేష్‌ నటించిన 'భరత్‌ అనే నేను' చిత్రం ప్రదర్శితమవుతోన్న ధియేటర్స్‌లో ఏ మాత్రం సందడి తగ్గలేదు. ఈ రోజు కూడా చాలా చోట్ల 'భరత్‌'కి హౌస్‌ఫుల్స్‌ నమోదయ్యాయి.

సాయి పల్లవికి ఉన్న క్రేజ్‌తో, 'ఛలో'తో నాగశౌర్య కొట్టిన హిట్‌తో 'కణం' సినిమాకి మంచి ఓపెనింగ్స్‌ వస్తాయని భావించారు. అదీ కాక డిఫరెంట్‌ హారర్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రమిది. అందుకే ఆడియన్స్‌ బాగానే ఆదరిస్తారనుకున్నారు. కానీ సీన్‌ రివర్స్‌ అయ్యింది. ఈ సినిమాని పెద్దగా పట్టించుకోలేదు. మరో పక్క ఫుల్‌ లెంగ్త్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన 'ఆచారి అమెరికా యాత్ర'పై కూడా అంచనాలు బాగానే నమోదయ్యాయి. కానీ ఆ అంచనాలను అందుకోవడంలో 'ఆచారి' ఫెయిలయ్యాడు. 'భరత్‌' దూకుడు మాత్రం తగ్గలేదు.

భరత్‌కి ఈ స్థాయిలో పట్టం కట్టినందుకు మహేష్‌బాబు విజయవాడ సందర్శనానికి వెళ్లారు. సినిమా ఇంత విజయం సాధించడానికి కారణమైనందుకు అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. దుర్గమ్మ ఆశీర్వాదంతో గతంలోనూ తాను నటించిన 'పోకిరి', ఒక్కడు', దూకుడు' సినిమాలు మంచి విజయం అందుకున్నాయి. ఆ సినిమాల విజయోత్సవ సభలు విజయవాడలోనే జరుపుకున్నాం. అదే సెంటిమెంట్‌తో భరత్‌ విజయానికి కృతజ్ఞతగా విజయవాడకు వచ్చానని మహేష్‌ అన్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS