'బోల్డ్‌'కి బై బై, 'విలనిజం'కి సై సై!

మరిన్ని వార్తలు

'కుమారి 21 ఎఫ్‌' సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ హెబ్బా పటేల్‌. తొలి సినిమాకే చాలా బోల్డ్‌ క్యారెక్టర్‌లో కనిపించింది. సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. హెబ్బా పటేల్‌కి మంచి గుర్తింపు కూడా తీసుకొచ్చింది. అయితే, ఆ తర్వాత ఆ స్థాయిలో హెబ్బా పేరు తెచ్చుకోలేదు. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమా ఆమె కెరీర్‌లో మరో మంచి హిట్‌గా నిలిచింది.

 

ఇక ఇప్పుడు హెబ్బా పటేల్‌ ఏం చేస్తోందా.? అంటే పెద్దగా చెప్పుకోదగ్గ ప్రాజెక్టులేమీ లేవు కానీ, తాజాగా ఓ అన్‌ఎక్స్‌పెక్ట్‌డ్‌ ప్రాజెక్ట్‌ ఒకటి హెబ్బాని వరించిందట. అదే 'భీష్మ'. నితిన్‌ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఆల్రెడీ రష్మికా మండన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో ఓ లేడీ విలన్‌ రోల్‌ని డిజైన్‌ చేశాడట డైరెక్టర్‌ వెంకీ కుడుముల. ఆ క్యారెక్టర్‌లో హెబ్బా పటేల్‌ని ఎంచుకున్నారట. ఇంకేముంది? మన కుమారి ఇరగదీసేయ్యదూ. ఆ క్యారెక్టర్‌ కోసం ఆల్రెడీ కసరత్తులు స్టార్ట్‌ చేసేసిందట.

 

సినిమాకి ఈ పాత్ర చాలా కీలకమట. ప్రాధాన్యత కూడా ఎక్కువేనట. మన హెబ్బా పటేల్‌ పంట పండిపోయినట్లే కదా. ఆల్రెడీ సెట్స్‌పై ఉన్న ఈ సినిమాని ఏ ఏడాది చివరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 'ఛలో'తో సూపర్‌ హిట్‌ కొట్టిన డైరెక్టర్‌ వెంకీ కుడుముల నుండి వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై ఓ మోస్తరు అంచనాలున్నాయి. సో చూడాలి మరి, తొలిసారి నెగిటివ్‌ టచ్‌లో దర్శనమిస్తున్న హెబ్బా.. ఆడియన్స్‌ని అబ్బా అనిపిస్తుందో లేదో.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS