మళ్లీ మెగా కాంపౌండ్‌కే ఫిక్సైన 'భరత్‌' బ్యూటీ.!

మరిన్ని వార్తలు

'భరత్‌ అనే నేను' సినిమాతో క్యూట్‌గా టాలీవుడ్‌కి పరిచయమైన ముద్దుగుమ్మ కైరా అద్వానీ. తొలి సినిమా సూపర్‌ సక్సెస్‌ కావడంతో క్రేజీయెస్ట్‌ హీరోయిన్‌ అనిపించుకుంది. ఎంట్రీలోనే ఒకేసారి మహేష్‌ మూవీకీ, మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ మూవీకి సైన్‌ చేసేసిందీ ముద్దుగుమ్మ. ఆల్రెడీ డెబ్యూ మూవీ సూపర్‌ హిట్‌. ఇక మరో బంపర్‌ హిట్‌కి రెడీగా ఉంది 'వినయ విధేయ రామ' సినిమాతో. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

ఇదిలా ఉంటే, లేటెస్టుగా స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కొత్త సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్‌ - బన్నీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ సినిమా రేపో మాపో సెట్స్‌ మీదికెళ్లనుంది. ఈ సినిమా కోసం హీరోయిన్‌గా కైరా అద్వానీ పేరును తెర పైకి తీసుకొచ్చారు. అల్లు అర్జున్‌ ఎప్పుడూ తన సినిమాలకి క్రేజీ భామల్నే ఎంచుకుంటుంటాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో క్రేజ్‌ ఉన్న ముద్దుగుమ్మల్లో పూజా హెగ్దే, కైరా అద్వానీ పేర్లనే ముందుగా ప్రస్థావించుకోవాలి. 

 

పూజా హెగ్దే మహేష్‌తో 'మహర్షి' సినిమాతోనూ, ప్రబాస్‌తో 'సాహో' సినిమాతోనూ బిజీగా ఉండడంతో కైరానే నెక్ట్స్‌ ఆప్షన్‌, అండ్‌ బెస్ట్‌ ఆప్షన్‌గా భావిస్తున్నారట. 'వినయ విధేయ రామ' విడుదలకు సిద్ధం కావడంతో కైరా డేట్స్‌ ప్రస్తుతం టాలీవుడ్‌కి సంబంధించినంత ఖాళీనే అని చెప్పాలి. హిందీలో 'అర్జున్‌రెడ్డి' రీమేక్‌ 'కబీర్‌ సింగ్‌'లో నటిస్తోంది. సో బన్నీకి కైరా అద్వానీ దాదాపు ఫిక్సయినట్లే అనుకోవాలి. ఇక అధికారిక ప్రకటన రావడమే ఆలస్యం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS