మహేష్ కోసం కత్రినా రీ ఎంట్రీ ... నిజమేనా?

మరిన్ని వార్తలు

టాలీవుడ్ లో ఉన్న అగ్ర హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. గతంలో 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' సినిమాల్లో కోటీశ్వరుడిగా నటించి ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకున్నాడు మహేష్ బాబు. ప్రస్తుతం అదే తరహాలో 'మహర్షి' సినిమా ద్వారా ప్రేక్షకులను అలరించడానికి సిద్దమవుతున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మించబడుతున్న ఈ మూవీలో హీరోయిన్ గా పూజా హెగ్డే, మరో ముఖ్యమైన పాత్రలో అల్లరి నరేష్ నటిస్తున్నారు. దేవిశ్రీ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల కానుంది.

 

'మహర్షి' సినిమా అనంతరం మహేష్ తదుపరి చిత్రం సుకుమార్ దర్శకత్వంలో ఉండబోతుందన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ సరసన కథానాయికగా రకుల్ ప్రీత్ సింగ్, కైరా అద్వానీ మొదలగు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే, తాజాగా మహేష్ హీరోయిన్స్ జాబితాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ పేరు కూడా చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సుకుమార్ తన సినిమాలో మహేష్ సరసన నటించేందుకు కత్రినాని ఎంచుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. 

 

ఇదిలాఉంటే, కత్రినా కైఫ్ తన సినిమా కెరీర్ ప్రారంభంలో తెలుగులో రెండు సినిమాలు చేసింది. ఒకటి వెంకటేష్ సరసన మల్లీశ్వరి, మరొకటి బాలకృష్ణ నటించిన 'అల్లరి పిడుగు'. ఆ తర్వాత పూర్తిగా బాలీవుడ్ కి పరిమితమై అక్కడ టాప్ హీరోయిన్ గా వెలుగొందుతుంది. అయితే, ఇలాంటి తరుణంలో కత్రినా టాలీవుడ్ సూపర్ స్టార్ కోసం తెలుగులో మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తుందా.. లేదా అన్నది వేచి చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS